ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది.
జాతీయ రహదారిపై ఉన్న గుంతల్ని తప్పించబోయి.. క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం చెప్పిన సంగతి తెలిసిందే. పంత్ను కలిసిన తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు జాతీయ రహదారుల శాఖ కౌంటర్ ఇచ్చింది.
ఇటీవల ప్రమాదానికి గురైన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన హర్యానా రోడ్వేస్ డ్రైవర్, ఆపరేటర్ను తమ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
Rishabh Pant was driving Mercedes-AMG GLE 43 4MATIC Coupe, this car specifications: రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి డెహ్రాడూన్ లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు పల్టీలు కొట్టింది. ఆ తరువాత కారుకు మంటలు అంటుకున్నాయి. అయితే సమీపంలో ఉన్న వారు రిషబ్ పంత్ ను…
Rishabh Pant Undergoes Plastic Surgery On Forehead: కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. రిషబ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో రిషబ్ కు వైద్య చికిత్స కొనసాగుతోంది. రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ప్రముఖులు ఆరా తీస్తున్నారు. నిన్న రాత్రి పంత్ కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.