Urvashi Rautela: రిషబ్ చేరిన ఆస్పత్రి ఫొటోను పోస్ట్ చేసిన ఊర్వశి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela: ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది. కారు ప్రమాదంలో మోకాలు, చీలమండలో స్నాయువు గాయాల చికిత్స కోసం డెహ్రూడూన్ నుంచి ముంబైలోని అంధేరీలో గల ఆస్పత్రికి తరలించిన కొద్దసేపటికే ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఊర్వశి తన ఇన్స్టా పోస్ట్లో ఏమి రాయనప్పటికీ, ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని ఆమె చెప్పకనే చెప్పింది. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న రిషబ్ పంత్ ఎన్హెచ్-58 హైవేపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘోర కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రిషబ్ ఒక్కడే కారులో ఉన్నాడు.
ఇదిలా ఉండగా.. రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా మధ్య సంబంధం గురించి చాలా పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. 2018లో ఒక హోటల్ లాబీలో తనను కలవడానికి రిషబ్ పంత్ గంటల తరబడి వేచి ఉన్నాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నప్పటి నుంచి రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2018లోనే ఊర్వశి, రిషబ్ ముంబైలోని అనేక ప్రసిద్ధ రెస్టారెంట్లు, పార్టీలు,ఈవెంట్లలో కనిపించడంతో వారు డేటింగ్లో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. చాలా కాలం తరువాత అదే సంవత్సరం ఇద్దరూ వాట్సాప్లో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని నివేదికలు పేర్కొన్నాయి.2019లో రిషబ్ పుకార్లను తోసిపుచ్చాడు. స్నేహితురాలు ఇషా నేగితో తన సంబంధాన్ని ప్రకటించాడు. అతను ఇన్స్టాగ్రామ్లో ఇషాతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. ఆమె కోసం ఒక సందేశాన్ని రాశాడు, “నేను చాలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను.” అంటూ ఇషాను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీంతో అవన్నీ పుకార్లని తేలిపోయింది.
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
గత వారం, రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత రౌతేలా ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో వైట్ హార్ట్ ఎమోజి, వైట్ డోవ్ ఎమోజి, వరుస నక్షత్రాలతో పాటు ‘ప్రార్థిస్తున్నాను’ అని శీర్షిక పెట్టారు. ఈ సారి ఆస్పత్రి ఫొటో పెట్టింది. ఊర్వశి రౌతేలా ఏమీ రాయనప్పటికీ, ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని నటి పేర్కొంది.

తాజావార్తలు
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!