TV Channels: రిషబ్ పంత్ యాక్సిడెంట్ కవరేజీ ఎఫెక్ట్.. ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TV Channels: క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం, కొన్ని ఇతర క్రైమ్ స్టోరీలకు సంబంధించిన టెలివిజన్ వార్తల కవరేజీపై కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో కొన్ని మీడియా ఛానళ్లు భయంగొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేయొద్దని హెచ్చరించింది. అన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లకు ఇచ్చిన సలహాలో.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ క్రికెటర్ కారు ప్రమాదం, మృతదేహాల బాధాకరమైన చిత్రాలను ప్రసారం చేయడం, ఐదేళ్ల బాలుడిని కొట్టడం వంటి కవరేజీని ఉదహరించింది. అలాంటి రిపోర్టింగ్ బాధాకరమని పేర్కొంది.
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్-1995” “ప్రోగ్రాం కోడ్” అమలు చేయాలని ఛానెళ్లకు ప్రభుత్వం సూచించింది. “ప్రోగ్రాం కోడ్” మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రైవేట్ ఛానెళ్లలకు సూచించింది. గత కొన్ని నెలలుగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు, చిన్నారులపై జరిగే హింస, వృద్ధులు, మహిళలపై జరిగే నేరాల ఘటనల ప్రసారాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతదేహాల దృశ్యాలు, గాయపడిన దృశ్యాలను యధాతథంగా ప్రసారం చేయడం పట్ల అభ్యంతరం తెలిపింది. ఇలాంటి ప్రసారాల కారణంగా చిన్నారులపై దుష్ప్రభావం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. టెలివిజన్ ఛానెళ్లు తమ వ్యవస్థలను సర్దుబాటు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ గట్టిగా మందలించింది.
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం
చాలా కేసుల్లో సోషల్మీడియా నుంచి నేరుగా వీడియోలను తీసుకుని ఎలాంటి ఎడిటింగ్, బ్లరింగ్ చేయకుండానే తమ మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు. నేరాలకు ఇలా రిపోర్ట్ చేయడం హృదయ విదారకమే గాక, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధమని, ఈ ఫుటేజ్లతో బాధితుల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలుగుతుందని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇటీవల రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం ఘటనలో క్రికెటర్ పంత్ రక్తపు గాయాలతో ఉన్న ఫోటోలను చూపించారు. దీంతో పాటు పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురైనప్పుడు కూడా అలాగే ప్రసారమయ్యాయి.
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!