తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్…
ఆ మధ్య కాంగ్రెస్కు రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ కాస్త వెనక్కి తగ్గారు.. అయితే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. జగ్గారెడ్డిని కలిసి చర్చలు జరపడంతో ఆయన తన ఆలోచన విరమించుకున్నారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, రేవంత్ రెడ్డి తనతో జరిగిన చర్చలను ఇవాళ బయటపెట్టారు జగ్గారెడ్డి.. అసెంబ్లీకి రేవంత్ వచ్చాడు.. జగ్గన్న అంటే నేను కూడా కలిశాను.. ఇద్దరూ కలిశారు సినిమా క్లోజ్ అని అనుకున్నారు.. కానీ, లోపలికి రండి అని పిలిచిన రేవంత్రెడ్డి..…
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నాకు ఝలక్ ఇచ్చుడు కాదు.. నేనే ఝులక్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నాకు ఝలక్ ఇచ్చానని రేవంత్రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో నన్ను మరింత హట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా అని ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్ పై బురద జల్లే…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టించిన జగ్గారెడ్డి ఇష్యూ చల్లబడినట్టే అనిపించింది.. అయితే, జగ్గారెడ్డి పదవులకు కోత విధిస్తూ తెలంగాణ పీసీసీ తీసుకున్న నిర్ణయంతో.. మరోసారి పార్టీలో కాక రాజేసినట్టు అయ్యింది.. ఇక, ఈ వ్యవహారంపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. మరోవైపు పీసీసీ చర్యపై మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు ఓసారి జగ్గారెడ్డిని ప్రశ్నించారు.. ప్రస్తుతం నాతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదన్న ఆయన..…
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా రేవంత్రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఇదే సమయంలో.. ఆయను టార్గెట్ చేసే బ్యాచ్ కూడా పెద్దదే.. క్రమంగా అందరితో కలిసిపోయే ప్రయత్నాలు జరుగుతున్నా.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై డైలాగ్స్ పేల్చడంలో… జగ్గారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.. పార్టీ వ్యక్తిగత ఇమేజ్ కోసం రేవంత్ పని చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. సీనియర్స్ సమావేశం తర్వాత… ఏకంగా రేవంత్కే సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. నేతలు కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది. అలా అని హద్దు మీరితే అధిష్టానం ఊరుకోదు. గీత దాటితే వేటు తప్పదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానంకి తెలుసు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. పీసీసీలో ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏఐసీసీ కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీకి…
All Political Parties Preparing for Elections. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహ రచన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు మైకుల ముందు మేమంటే మేము అంటూ.. మైకుల పగిలేలా స్పీచులు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని…
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన మన ఊరు-మన పోరు సభ ముగిసింది. 35 వేల మెజారిటీతో సురేందర్ ని గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించే సమయం కూడా లేదు. ఒక్క ఎమ్మెల్యే డబ్బులు పెట్టుకుంటే వందలాది కరడుగట్టిన సైనికులను తయారు చేస్తాం.టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు నీరు, ఉచిత విద్యుత్ ఇచ్చామని…
సీఎం కేసీఆర్తో కొట్లాడాలనేదే తన విధానమని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ పార్టీ అవుతుందనుకుంటే ఇక్కడే ఉంటానని లేదంటే మరో పార్టీ గురించి ఆలోచిస్తానని చెప్పారు. కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరు కొట్లడితే వాళ్లతో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.. ఇక, తనకు బాధ్యత అప్పగిస్తే.. పదిమందిని గెలిపిస్తానని చెప్పారు. అదే సమయంలో నాకు పదవి కూడా అక్కర లేదన్న ఆయన.. పది మందిని గెలిపించూ అని బాధ్యత ఇస్తే గెలిపిస్తా అన్నారు… మరోవైపు, పీసీసీ…