Bhatti Vikramarka: కాంగ్రెస్ గెలిస్తే, ఆ లక్ష్యాలన్నీ పూర్తవుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు తెలంగాణలోని వరంగల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా రైతులు తరలివచ్చారు. ఈ వేదిక సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సభ తొలిమెట్టు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిపెట్టిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకే మూడు లక్షల వరకు రుణాలు, సబ్సిడీకి ట్రాక్టర్లు & వ్యవసాయ పనిమూట్లు, మద్దతు ధరతో ధాన్యం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ, టీఆర్ఎస్ రైతు బంధు పథకం తీసుకొచ్చి, ఆ స్కీమ్స్ని బంద్ చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి, బలహీన వర్గాల్ని, పాడుభూమి వ్యవసాయం చేసుకునే గిరిజనుల్ని రక్షించడానికి.. రాహుల్ గాంధీ వ్యవసాయ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారని.. ఇందుకు తాము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, పెండింగ్లో ఉన్న లక్ష్యాలన్నీ తప్పకుండా నెరవేరుతాయని హామీ ఇచ్చారు.
Also Read
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ముందు ఎన్నో లక్ష్యాలు ఉండేవని, నదుల నీళ్ళు పంట పొలాలకు పారుతాయని, రైతాంగ సోదరులు ఆత్మగౌరవంతో బతుకుతారని, సంపదంతా ప్రజలకు దక్కుతుందని సోనియా గాంధీ ఆశించారన్నారు. కానీ, ఎనిమిదేళ్ళయినా కృష్ణా నదిపై గానీ, గోదావరి నదిపై గానీ టీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పది లక్షల కోట్లు ఖర్చయ్యింది కానీ, ఒక్క ఎకరానికి నీళ్ళు అందలేదన్నారు. ఆ లక్ష్యాల్ని నెరవేర్చడానికే రాహుల్ గాంధీ నేనున్నానంటూ వచ్చారన్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కదం తొక్కుతూ వచ్చిన రైతాంగ సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తన ప్రసంగాన్ని భట్టి విక్రమార్క ముగించారు.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!