Revanth Reddy: వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని తెలిపారు తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారాయన.. ఈ సందర్భంగా ఎన్నికలు, అధికారం గురించి మాట్లాడుతూ.. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 94 నుంచి 2004 టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు అధికారంలో ఉన్నాయన్నారు. ఇక, ప్రజల్లో వచ్చిన మార్పును కేసీఆర్ ముందే పసిగట్టారన్న రేవంత్.. అందుకే.. కాంగ్రెస్ వదిలి.. బీజేపీ టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీని పెంచే ప్రయత్నాలుచేస్తున్నారంటూ మండిపడ్డారు.
Read also: KA Paul: కేటీఆర్కు వార్నింగ్.. నువ్వు పుట్టకముందే ప్రపంచాన్ని వణికించా..
Also Read
సీఎం కేసీఆర్ రాక్షస రాజకీయ క్రీడకు తెరలేపారు.. కుటుంబ పాలనతో రైతులు చితికిపోయారన్నారు రేవంత్రెడ్డి.. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం సమస్యను సృష్టించారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంలో రైతులు బాగుపడేలా పాలన చేయొచ్చు.. కానీ, అన్ని వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడిస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు..
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!