JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో వ్యూస్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ దాదాపు 78.5 కోట్లకు చేరుకుని సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో హాట్ స్టార్ లో వ్యూస్ సంఖ్య సుమారు 58.3 కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత మ్యాచ్ క్రమంగా ఉత్కంఠభరితంగా మారడంతో వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
Also Read
- TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
- Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
- Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ ఔటైన సమయంలో భారీ స్థాయిలో వ్యూస్ పెరిగాయి. ఆ సమయంలో మొత్తం వ్యూస్ సుమారు 63.2 కోట్లకు చేరాయి. ఆ వికెట్ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గుచూపడంతో ప్రేక్షకుల నుంచి మరింత ఆసక్తి పెరిగింది. ఇక మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ సంఖ్య భారీగా పెరిగింది. భారత్ విజయం ఖరారయ్యే సమయంలో జియో హాట్ స్టార్ లో వ్యూస్ దాదాపు 80 కోట్లకు చేరువైంది. భారత్ విజయం ఖాయం చేసిన చివరి క్యాచ్ పట్టిన సమయంలోనే వ్యూస్ సంఖ్య 74.5 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
ఇదిలా ఉండగా.. ఇదే టోర్నీలో ముందుగా జరిగిన భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా భారీ స్పందన లభించింది. ఐసీసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆ మ్యాచ్ను జియోహాట్స్టార్లో ఒకేసారి సుమారు 6.52 కోట్ల మంది వీక్షించారు. ఈ లెక్కలు భారత్ లో క్రికెట్ కు ఉన్న భారీ ప్రజాదరణ ఏ రేంజ్ లో ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా భారత్ ఆడే కీలక మ్యాచ్లకు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రేక్షకుల స్పందన భారీగా పెరుగుతున్నట్లు ఈ రికార్డులు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
-
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
-
Kudankulam Nuclear Plant: కుడంకుళం అణు కేంద్రంలో డేటా లీక్?.. డార్క్ వెబ్లో బ్లూప్రింట్లు
-
Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!