JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో వ్యూస్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ దాదాపు 78.5 కోట్లకు చేరుకుని సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో హాట్ స్టార్ లో వ్యూస్ సంఖ్య సుమారు 58.3 కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత మ్యాచ్ క్రమంగా ఉత్కంఠభరితంగా మారడంతో వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ ఔటైన సమయంలో భారీ స్థాయిలో వ్యూస్ పెరిగాయి. ఆ సమయంలో మొత్తం వ్యూస్ సుమారు 63.2 కోట్లకు చేరాయి. ఆ వికెట్ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గుచూపడంతో ప్రేక్షకుల నుంచి మరింత ఆసక్తి పెరిగింది. ఇక మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ సంఖ్య భారీగా పెరిగింది. భారత్ విజయం ఖరారయ్యే సమయంలో జియో హాట్ స్టార్ లో వ్యూస్ దాదాపు 80 కోట్లకు చేరువైంది. భారత్ విజయం ఖాయం చేసిన చివరి క్యాచ్ పట్టిన సమయంలోనే వ్యూస్ సంఖ్య 74.5 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
ఇదిలా ఉండగా.. ఇదే టోర్నీలో ముందుగా జరిగిన భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా భారీ స్పందన లభించింది. ఐసీసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆ మ్యాచ్ను జియోహాట్స్టార్లో ఒకేసారి సుమారు 6.52 కోట్ల మంది వీక్షించారు. ఈ లెక్కలు భారత్ లో క్రికెట్ కు ఉన్న భారీ ప్రజాదరణ ఏ రేంజ్ లో ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా భారత్ ఆడే కీలక మ్యాచ్లకు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రేక్షకుల స్పందన భారీగా పెరుగుతున్నట్లు ఈ రికార్డులు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!