JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో వ్యూస్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ దాదాపు 78.5 కోట్లకు చేరుకుని సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో హాట్ స్టార్ లో వ్యూస్ సంఖ్య సుమారు 58.3 కోట్లుగా నమోదైంది. ఆ తర్వాత మ్యాచ్ క్రమంగా ఉత్కంఠభరితంగా మారడంతో వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ ఔటైన సమయంలో భారీ స్థాయిలో వ్యూస్ పెరిగాయి. ఆ సమయంలో మొత్తం వ్యూస్ సుమారు 63.2 కోట్లకు చేరాయి. ఆ వికెట్ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గుచూపడంతో ప్రేక్షకుల నుంచి మరింత ఆసక్తి పెరిగింది. ఇక మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ సంఖ్య భారీగా పెరిగింది. భారత్ విజయం ఖరారయ్యే సమయంలో జియో హాట్ స్టార్ లో వ్యూస్ దాదాపు 80 కోట్లకు చేరువైంది. భారత్ విజయం ఖాయం చేసిన చివరి క్యాచ్ పట్టిన సమయంలోనే వ్యూస్ సంఖ్య 74.5 కోట్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
BrahMos Deal: భారత్ ‘బ్రహ్మోస్’పై ఇండోనేషియా దృష్టి.. త్వరలో కొనుగోలు ఒప్పందం.!
ఇదిలా ఉండగా.. ఇదే టోర్నీలో ముందుగా జరిగిన భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా భారీ స్పందన లభించింది. ఐసీసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆ మ్యాచ్ను జియోహాట్స్టార్లో ఒకేసారి సుమారు 6.52 కోట్ల మంది వీక్షించారు. ఈ లెక్కలు భారత్ లో క్రికెట్ కు ఉన్న భారీ ప్రజాదరణ ఏ రేంజ్ లో ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా భారత్ ఆడే కీలక మ్యాచ్లకు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రేక్షకుల స్పందన భారీగా పెరుగుతున్నట్లు ఈ రికార్డులు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!