రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశమై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని టీడీపీ అధినేత తేల్చి చెప్పేశారు.
దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది.
శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఓటింగ్కు అర్హత సాధించిన మొత్తం 285 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. మొత్తం ఆరు స్థానాలకు గానూ ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు.…
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరగనుంది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న…
బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలకు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర మంత్రులను ఇంచార్జులుగా నియమించింది. రాజస్తాన్ కు ఎన్నికల ఇంచార్జ్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను, హర్యానాకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కర్ణాటకకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కర్ణాటకకు ఇంచార్జులుగా నియమించారు. జూన్ 10…
రాజ్యసభ ఆరేళ్ళ పదవీకాలం. రాజకీయనేతలకు అదో మంచి అవకాశం. అయితే ఈమధ్యకాలంలో రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తల్ని అందలం ఎక్కిస్తున్నాయి.రాజ్యసభకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల ఎన్నికల అనివార్యం అయ్యేలా వుంది. జూన్ 10 న ఓటింగ్ జరగనుంది. కొంతమంది నేతల్ని ఉత్తరాది నుంచి రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ నుంచి పరిశీలనలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్,…