Rajya Sabha: ఉత్తరాది నుంచి తెలుగు నేతలకు బీజేపీ అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఆరేళ్ళ పదవీకాలం. రాజకీయనేతలకు అదో మంచి అవకాశం. అయితే ఈమధ్యకాలంలో రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తల్ని అందలం ఎక్కిస్తున్నాయి.రాజ్యసభకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల ఎన్నికల అనివార్యం అయ్యేలా వుంది. జూన్ 10 న ఓటింగ్ జరగనుంది.
కొంతమంది నేతల్ని ఉత్తరాది నుంచి రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ నుంచి పరిశీలనలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, పురందేశ్వరి పేర్లు వున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ నుంచి పరిశీలనలో డా. లక్ష్మణ్, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి పేర్లు వున్నాయి. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలకు ఈదఫా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయంచినట్లు సమాచారం.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
రాజ్యసభలో తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ రాష్ట్రాల బీజేపీ నేతలకు రాజ్యసభలో అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. ఈనెలాఖరుతో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసే ఆఖరు తేది దగ్గరపడుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయి బీజేపీలో చేరే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి అవకాశం ఇస్తామని అప్పట్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు బీజేపీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు జూన్ 2 వతేదీ కల్లా పదవీకాలం పూర్తికానుంది. వీరిద్దరితో పాటు రాజ్యసభ పరిశీలనలో పురందేశ్వరి పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్ర నేతలకు అవకాశం లభించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఒక్కొక్కరికి రాజ్యసభ లో అవకాశం రానుంది. సమీకరణలు కుదరని పక్షంలో ఒకరికి రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ పదవి లభిస్తుందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ పదవులకు పరిశీలనలో రాష్ట్ర బిజేపి మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు. మరో రెండు మూడు రోజులలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!