Rajya Sabha: ఉత్తరాది నుంచి తెలుగు నేతలకు బీజేపీ అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఆరేళ్ళ పదవీకాలం. రాజకీయనేతలకు అదో మంచి అవకాశం. అయితే ఈమధ్యకాలంలో రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తల్ని అందలం ఎక్కిస్తున్నాయి.రాజ్యసభకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల ఎన్నికల అనివార్యం అయ్యేలా వుంది. జూన్ 10 న ఓటింగ్ జరగనుంది.
కొంతమంది నేతల్ని ఉత్తరాది నుంచి రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ నుంచి పరిశీలనలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, పురందేశ్వరి పేర్లు వున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ నుంచి పరిశీలనలో డా. లక్ష్మణ్, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి పేర్లు వున్నాయి. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలకు ఈదఫా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయంచినట్లు సమాచారం.
Also Read
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!
- AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
- AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
రాజ్యసభలో తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ రాష్ట్రాల బీజేపీ నేతలకు రాజ్యసభలో అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. ఈనెలాఖరుతో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసే ఆఖరు తేది దగ్గరపడుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయి బీజేపీలో చేరే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి అవకాశం ఇస్తామని అప్పట్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు బీజేపీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు జూన్ 2 వతేదీ కల్లా పదవీకాలం పూర్తికానుంది. వీరిద్దరితో పాటు రాజ్యసభ పరిశీలనలో పురందేశ్వరి పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్ర నేతలకు అవకాశం లభించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఒక్కొక్కరికి రాజ్యసభ లో అవకాశం రానుంది. సమీకరణలు కుదరని పక్షంలో ఒకరికి రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ పదవి లభిస్తుందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ పదవులకు పరిశీలనలో రాష్ట్ర బిజేపి మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు. మరో రెండు మూడు రోజులలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.
తాజావార్తలు
-
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
-
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు మాస్ కిక్ స్టార్ట్!
-
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
-
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
-
Imran Khan: తక్షణమే ఇమ్రాన్ఖాన్ను ఆస్పత్రికి తరలించండి.. సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!