జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్కు పవన్కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్కు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తూర్పు గోదావరి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగసభకు అనుమతి లేదని అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు.. సభా వేదిక మార్చుకోవాలని సూచించినట్టు అడిషనల్ ఎస్పీ తెలిపారు.. బాలాజీపేటలో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. మరోవైపు అనుమతిలేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్పై కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది జనసేన.. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమధానం కార్యక్రమం వేదిక మార్చామని.. అనుమతి…
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్…
పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పర్వాలేదు అనే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంది.. రాజమండ్రి ఎంపీ భరత్ దత్తత గ్రామంలోనూ సత్తాచాటిన జనసేన విజయం సాధించింది.. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ కౌంటర్ ఇచ్చారు ఎంపీ భరత్.. నా దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఓటమిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలం.. అని ప్రశ్నించారు.. ఇక, జనసేన ప్రభావం ఆ గ్రామంలో…
మెగా హీరోలు సింప్లిసిటీ లైఫ్ ని ఎంతగా ఇష్టపడతారో అందరికి తెలిసిందే.. అది మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ద్వారా రుజువైంది. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నా బన్నీ.. టిఫిన్ చేయడానికి రోడ్ సైడ్ వున్నా చిన్న హోటల్ కి వెళ్లి తిన్నారు. ‘పుష్ప’ షూటింగ్ మధ్యలో లభించిన బ్రేక్ సమయంలో కాకినాడలోని థియేటర్లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు. అయితే అల్లు అర్జున్ గోకవరం దగ్గర రోడ్డు సైడ్…
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని…
అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్ దారి తప్పుతోందట. మేయర్ ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట. గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన…
నేటి నుంచి రాజమండ్రి – కాకినాడ నాన్స్టాప్ సర్వీసులు పునరుద్ధరణ జరిగింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఈ రూటులో నాన్ స్టాప్ సర్వీసులు నిలిచిపోయాయి. కాకినాడకు రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 5.30కు తొలి సర్వీసు ప్రారంభం అయ్యింది. ఆఖరి సర్వీసు మధ్యాహ్నం 12.30కు బయలుదేరుతుంది. కాకినాడ డిపో నుంచి కూడా ఇదే సమయాల్లో రాజమండ్రికు నాన్స్టాప్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇక ప్రతి…
గ్రామాల విలీనం పూర్తయింది. డివిజన్ల ముసాయిదా విడుదలైంది. అధికార, విపక్ష పార్టీలలో ఆధిపత్యపోరుకు మాత్రం చెక్ పడలేదు. వరసగా నాలుగోసారి పాగా వేయాలని ఒక పార్టీ.. తొలిసారి జెండాను రెపరెపలాడించాలని మరొకపార్టీ కలలు కంటున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. రాజమండ్రి వైసీపీ, టీడీపీ నేతల్లో ఐక్యత లేదా? గోదావరి తీరంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కుతోంది. విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ముసాయిదా విడుదల కావడంతో స్పీడ్…