చిరు పర్యటనలో వైసీపీ మంత్రులు.. ఆసక్తికరంగా ఏపీ రాజకీయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది.
గత కొద్దిరోజులుగా ఇదే ఇష్యూపై ఏపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానాన్ని ఇండస్ట్రీ పెద్దలే కోరారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెబుతున్నారు. అయితే పవన్ మాత్రం ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మడం ఏంటని నిలదీస్తున్నారు. సినీ కార్మికులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిపై పరుష పదజాలం ఉపయోగించడం విమర్శలకు తావిచ్చింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
దీంతో సదరు మంత్రి సైతం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గా జనసేన నేతలు ఆయన కాన్వాయ్ ను అడ్డుకోవడం వంటి నిరసనలు చేశారు. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలోని వారంతా రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ఆయన వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ సీని పెద్దలు లేఖ విడుదల చేశారు.
ఇదే సమయంలో నిన్న మంత్రి పేర్ని నానిని ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు కలిశారు. ఈసందర్భంగా వారు సినిమా వేరు, రాజకీయం వేరని పవన్ వ్యాఖలను దాటవేసే ప్రయత్నం చేశారు. సినిమా చాలా సున్నితమైందని దీన్ని కాంట్రవర్సీ చేయద్దని వేడుకున్నారు. వైసీపీ సర్కారు ఇండస్ట్రీ సమస్యలపై సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు పేర్ని నాని సైతం పవన్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారని పేర్కొనడం ఆసక్తిని రేపింది. పవన్ వ్యాఖ్యలను ఇండస్ట్రీనే కాదు సొంత అన్న కూడా సమర్ధించడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తేటతెల్లం చేశారు.
తాజాగా చిరంజీవి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. నేడు రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల ఆవరణలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులతోపాటు మెగా నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వీరి వెంట వైసీపీ మంత్రులు, నేతలు పెద్దఎత్తున పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవిని తమవాడిగా వైసీపీ నేతలు ఫోకస్ చేసుకుంటున్న వైనం చర్చనీయాంశమైంది.
చిరంజీవి తొలి నుంచి వైసీపీకి మద్దతు దారుడిగా ఉన్నారు. ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి చిరంజీవి మద్దతు ఇచ్చారు. అలాగే కరోనా విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇండస్ట్రీ సమస్యలను జగన్ దృష్టికెళుతున్నారు. చిరంజీవి పర్యటనలో వైసీపీ మంత్రులు, నేతలు ఉండటంపై జనసైనికులు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!