పవన్ కాపు నినాదం.. ఆ కులాన్ని ఏకం చేస్తారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడును పెంచుతున్నారు. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ జనాల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా జనసేన ఇటీవల కొన్ని కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మన్నలను పొందే ప్రయత్నం చేస్తోంది. జనసేన తొలి విడుతగా తీసుకున్న రోడ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తుంది. ఇదే సమయంలో వైసీపీ వర్సెస్ జనసేన వార్ నడుస్తోంది.
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జగన్ సర్కారును ఎదుర్కొని నిలబడలేకపోతోంది. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కొద్దిరోజులుగా వైసీపీని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూనే సినిమా సమస్యలపై ఇటీవల ప్రశ్నించారు. అయితే ఇదికాస్తా రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ కు తెరలేపింది. ఎవరికీవారు తగ్గకపోవడంతో పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ గురించే చర్చ నడుస్తోంది.
Also Read
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
రోడ్ల శ్రమదానం కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటన చేపట్టారు. రోడ్లపై శ్రమదానం చేసిన అనంతరం పవన్ బహిరంగ సమావేశంలో మాట్లాడారు. వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాపుకార్డును ఆయన తెరపైకి తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కుల రాజకీయాలకు దూరంగా పవన్ కల్యాణ్ కాపులంతా ఏకం కావాల్సిందని పిలుపునివ్వడం వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. కాపులు ఏపీలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఆయన గుర్తు చేశారు.
కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలు ఐక్యంగా ఉంటూ బీసీ,ఎస్సీలతో కలిసి రాజ్యాధికారం దిశగా సాగాలని పవన్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ అందుకు తగ్గట్టుగానే కాపు కార్డును తెరపైకి తీసుకొస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓటర్లు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందని అంతా భావిస్తున్నారు. ఈ వర్గాన్ని వైసీపీకి దూరం చేయడం ద్వారా వైసీపీ ఓట్లకు పవన్ గండికొట్టే అవకాశం కన్పిస్తోంది.
మరోవైపు గత ఎన్నికల్లో జనసేనకు ఐదు నుంచి ఆరుశాతం ఓట్లు పోలయ్యారు. వీటిలో నాలుగుశాతం ఓటర్లు కాపు వర్గానికి చెందినవారే. దీంతో ఈ వర్గాన్ని తనవైపు తిప్పుకునేలా పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నట్లు కన్పిస్తోంది. అలాగే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వైసీపీ నేతలను పవన్ వదిలిపెట్టలేదు. ఎవరికీ ఇవ్వాల్సింది వారికి ఇచ్చేశారు. ఏదిఏమైనా పవన్ కల్యాణ్ ‘పవర్’ ఫుల్ గా వాడబోతున్న కాపు కార్డు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!