గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను తీసుకవచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టాలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఇటు ప్రతిపక్షాలు, అటు రైతులు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నేడు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ వ్యవసాయ చట్టాల…
మూలిగే నక్కపై తాటి పండు పడటం అంటే ఇదే. కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ. అసలే దాని పరిస్థితి బాగా లేదు. దేశంలో ఎన్నడూ లేనంతగా బలహీన పడింది. తొలి నుంచి ఈశాన్య భారతం కాంగ్రెస్కు పెట్టని కోట. కానీ ఇప్పుడు అక్కడ ఖాళీ అవుతోంది. బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం మేఘాలయ కూడా చేయి దాటి పోయింది. దాంతో ఈశాన్య రాష్ట్రాలలో హస్తం పని అయిపోయింది అనే భావన కలిగిస్తోంది. మేఘాలయలో 17 మంది కాంగ్రెస్…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమే నని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతూనే వస్తుందని, ఆరైతు చట్టాల్లో రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు ఉన్నాయని, ఆ చట్టాల రూపకల్పన, అమలు విషయలో కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అని అన్నారు. ఈ విషయమై ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ దేశ రైతాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా వారు చేపట్టిన…
కొత్త సాగుచట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రైతు చట్టాలు రద్దు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేంద్రప్రభుత్వం అహంకారాన్ని రైతుల సత్యాగ్రహం ఓడించిందని ట్వీట్ చేశారు. రైతు చట్టాలు తీసుకురావడమే తప్పని, రైతులు ఏడాది కాలంగా పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో అనేకమంది అన్నదాతలు ప్రాణాలు…
t20ప్రపంచ కప్లో వరుస ఓటములతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ప్రమాదంలో పడనున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుపై త్వరలో జరగనున్న బీసీసీఐ సెలెక్టర్ల సమావేశంలో చర్చ జరగనుందని ఓ అధికారి తెలిపారు. వరుస ఓటములు టీ20 వరల్డ్ కప్లో భారత్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉందని, కోహ్లీని వన్డే సారథ్యం నుంచి కుడా తప్పించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వన్టేలు, టీ20లకు రోహిత్ లేదా మరెవరైనా.. టెస్టులకు కోహ్లీని సారథిగా ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కోహ్లీకి…
టీ20 ప్రపంచకప్లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్ విరాట్.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ…
సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు ఉపసంహరణ కానున్నాయన్నారు. అన్నదాతల సత్యాగ్రహం భేష్ అంటూ ట్వీట్ చేశాడు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోఏడాదిగా మూతపడిన ఢీల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దులను అధికారులు ఇవాళ తెరిచారు. రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీతో ఎన్నికలకు సమయం…
వివిధ పార్టీల్లో మెంబర్ షిప్లు చాలా ఈజీగా లభిస్తాయి. మన పేరు చెప్పి వందో, రెండువందలో కడితే మెంబర్ షిప్, దానికి అదనంగా బీమా సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పురాతన పార్టీ కాంగ్రెస్లో మెంబర్ షిప్ తీసుకోవడం అంత ఈజీగా కాదు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే…
2019 లోక్సభ ఎన్నికలు నిరాశపరిచినా వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపాలని ప్రియాంక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజల చూపు నిరంతరం తన వైపు ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఎన్నికలు ఆమెలోని గాంధీ కుటుంబ సమ్మోహన శక్తికి పరీక్ష కానున్నాయి. ప్రియాంక తన హావభావాలే కాదు.. యాక్షన్ లో కూడా నానమ్మ ఇందిరా గాంధీని గుర్తుచేస్తున్నారు. మరోవైపు, ప్రియాంక గాంధీ రాజకీంగా తన అన్న రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కానీ ఆప్పుడప్పుడు తనదైన స్టయిల్లో.…
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం ఆపార్టీపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. క్రమంగా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పట్టుకోల్పోతుండటంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆపార్టీకి కీలకంగా మారాయి. అయితే మోదీ-అమిత్ షా హవా ముందు కాంగ్రెస్ వ్యూహాలు పని చేయడం లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని ఎలా…