Rahul Gandhi: హైదరాబాద్లో ఉండొద్దు.. ఢిల్లీకి అసలే రావొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ.. శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని చెప్పిన ఆయన.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని సూచించారు.
కేవలం ప్రెస్మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టుకుండా.. నేతలందరూ తమతమ నియోజకవర్గాలకు వెళ్ళి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువకులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించాలన్నారు. ఎంతటి సీనియర్ లీడర్లైనా సరే… పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని మరోసారి తేల్చి చెప్పారు. కష్టపడి పని చేసిన వాళ్లకి మెరిట్ ప్రాతిపదికన టిక్కెట్లు లభిస్తాయని ఇదివరకే రైతు సంఘర్షణ సభలో చెప్పిన రాహుల్.. మరోసారి ఈ సమావేశంలో గుర్తు చేశారు. అంతర్గత విబేధాలకు స్వస్తి పలికి… ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 300 మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Also Read
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
ఇదిలావుండగా.. రైతు సంఘర్షణ సభలో అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాహుల్, వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే! తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు నేరుగా వారి ఎకౌంట్స్లోకి రూ. 15 వేలు వేస్తామని మాటిచ్చారు. తాము వట్టిమాటలు చెప్పట్లేదని, కచ్ఛితంగా చేసి చూపిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. టీఆర్ఎస్ రైతులకు ఎంతో అన్యాయం చేసిందని, తమ ప్రభుత్వం వచ్చాక రైతు సమస్యల్ని ప్రధానంగా తీరుస్తామని మాటిచ్చారు.
తాజావార్తలు
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
-
Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!