KTR: కాంగ్రెస్తో పొత్తుపై కేటీఆర్ బాంబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించిన రైతు సంఘర్షణలో సభలో తాము ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోమని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ విషయంపై వరంగల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ స్పందించారు. అసలు కాలం చెల్లిన కాంగ్రెస్తో ఎవరు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటారంటూ ఛలోక్తులు పేల్చారు. దేశంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే వారు ఎవరూ లేదరని, అసలు ఆ పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అంటూ సెటైర్ వేశారు. సొంత నియోజకవర్గంలోనే ఒక ఎంపీగా గెలవని రాహుల్.. తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపిస్తారా? అంటూ మరో పంచ్ విసిరారు.
గాంధీ భవన్ను కాంగ్రెస్ గాడ్సేకి అప్పగించిందని చెప్పిన కేటీఆర్.. ఎవరో రాసిన స్క్రిప్టుని రాహుల్ చదివారన్నారు. రైతుల ఆత్మహత్యలు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. ఏఐసీసీ అంటూ ఆలిండియా క్రైసిస్ కమిటీ అని ఎద్దేవా చేసిన కేటీఆర్.. నిజంగానే కాంగ్రెస్ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే, పంజాబ్లో ఎందుకు ఓడిపోయిందని నిలదీశారు. వరంగల్లో ప్రకటించిన డిక్లరేషన్లో కొత్త అంశాలేవీ లేవని, 2018లో చెప్పిన విషయాల్ని మళ్ళీ రిపీట్ చేశారన్నారు. ధాన్యం గురించి రాహుల్ పార్లమెంట్లో ఏనాడూ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, నిరంతర విద్యుత్తు, రైతు బీమా, వలసలు లేని ఊరు లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలేవీ కాంగ్రెస్ హయాంలో లేవన్నారు.
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే, కేసీఆర్ గొప్ప శక్తిగా మార్చారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నేతలు పాతర వేస్తే, తాము జాతర లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చామన్నారు. రుణమాఫీ చేయలేదని విమర్శిస్తున్నారని, తాము రుణమాఫీ చేశామో లేదో అన్నదాతకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవాల్సిన అవసరం ఉందని, వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటల్ని ఎవ్వరూ విశ్వసించొద్దని తెలంగాణ రైతన్నలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!