సాగు చట్టాలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలు ఉపసంహరణ కానున్నాయన్నారు. అన్నదాతల సత్యాగ్రహం భేష్ అంటూ ట్వీట్ చేశాడు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోఏడాదిగా మూతపడిన ఢీల్లీ- ఉత్తరప్రదేశ్ సరిహద్దులను అధికారులు ఇవాళ తెరిచారు. రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీతో ఎన్నికలకు సమయం…
వివిధ పార్టీల్లో మెంబర్ షిప్లు చాలా ఈజీగా లభిస్తాయి. మన పేరు చెప్పి వందో, రెండువందలో కడితే మెంబర్ షిప్, దానికి అదనంగా బీమా సదుపాయం కూడా లభిస్తుంది. అయితే, దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పురాతన పార్టీ కాంగ్రెస్లో మెంబర్ షిప్ తీసుకోవడం అంత ఈజీగా కాదు. పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే…
2019 లోక్సభ ఎన్నికలు నిరాశపరిచినా వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపాలని ప్రియాంక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజల చూపు నిరంతరం తన వైపు ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఎన్నికలు ఆమెలోని గాంధీ కుటుంబ సమ్మోహన శక్తికి పరీక్ష కానున్నాయి. ప్రియాంక తన హావభావాలే కాదు.. యాక్షన్ లో కూడా నానమ్మ ఇందిరా గాంధీని గుర్తుచేస్తున్నారు. మరోవైపు, ప్రియాంక గాంధీ రాజకీంగా తన అన్న రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. కానీ ఆప్పుడప్పుడు తనదైన స్టయిల్లో.…
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం ఆపార్టీపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. క్రమంగా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పట్టుకోల్పోతుండటంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆపార్టీకి కీలకంగా మారాయి. అయితే మోదీ-అమిత్ షా హవా ముందు కాంగ్రెస్ వ్యూహాలు పని చేయడం లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని ఎలా…
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అని చెప్పవచ్చు. కాగా, ఇప్పుడు ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీలో కాంగ్రెస్ తోపాటుగా సమాజ్ వాదీ పార్టీ కూడా పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా కాకుండా పోటాపోటీగా జరిగే అవకాశం ఉన్నది. ఇక ఇదిలా ఉంటే,…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరారు.. మరోవైపు.. తాను కాంగ్రెస్కు తాత్కాలిక అధ్యక్షురాలిగా లేనని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే…
దేశవ్యాప్తంగా లఖింపూర్ ఖేరి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది… కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్తో రైతుల ర్యాలీపైకి దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతిచెందగా.. ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు మృతిచెందడం సంచలనంగా మారింది… అయితే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసేందుకు సిద్ధం అయ్యారు కాంగ్రెస్ నేతులు.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం.. రేపు రాష్ట్రపతితో సమావేశం కానుంది.. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను…
కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీలు.. గాంధీలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ చేజారిపోతే ఆపార్టీ బ్రతికి బట్టకట్టదనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సోనియాగాంధీ ఎంత కష్టమైనా అధ్యక్ష బాధ్యతలను తానే మోస్తున్నారు. ఒక్కసారి అధ్యక్ష పీఠం చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి తెలుసు. అందుకే ఆమె అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు కట్టబెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇస్తేగిస్తే గాంధీ కుటుంబంలోని వారికేనని…
కాంగ్రెస్లో మళ్లీ కలకలం.. హస్తం పార్టీలో అలజడి కొత్త కాదు. కానీ, కొద్ది రోజుల క్రితం కపిల్ సిబల్ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించటమే తాజా సంక్షోభానికి కారణం. నాయకత్వాన్ని ప్రశ్నించటం కార్యకర్తలకు నచ్చలేదు. సిబల్ ఇంటి మీద పడ్డారు. గొడవ గొడవ చేశారు. ఇదంతా కావాలనే చేయించారని సిబాల్ బృందం అంటోంది. దాంతో వారు నాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాల పట్ల…