Rahul Gandhi: చంచల్ గూడ జైలుకు రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అయితే రాహుల్ చంచల్ గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చంచల్ గూడ్ జైలులో ఉన్న ఎన్ఎస్యూ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతో పాటు మరోక్కరికి మాత్రమే ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు జైళ్ల శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ అధికారికంగా ధ్రువీకరించారు.
Read Also: Chandrababu: ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు..
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
హోటల్ తాజృష్ణాలో బస చేసిన ఆయనను, పార్టీ నాయకులతో పాటు.. గద్దర్ వంటి మరికొందరు ముఖ్యులు భేటీ అయ్యారు. అనంతరం దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పించిన ఆయన.. అక్కడినుంచి నేరుగా చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న NSUI నేతలతోనూ భేటీ కానున్నారు. అంతకుముందు హైడ్రామా నడుమ చంచల్ గూడ జైల్లో రాహుల్ గాంధీ ములాఖత్ కు పర్మిషన్ లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంచల్గూడ వెళ్లనున్న రాహుల్ జైల్లో ఉన్న NSUI నేతలు, కార్యకర్తలను పరామర్శించనున్నారు. దీంతో జైలు దగ్గర అదనపు బలగాలను మోహరించి భద్రత పెంచారు పోలీసులు. రాహుల్, రేవంత్.. ఇద్దరికి మాత్రమే అనుమతి లభించింది. అయితే, చివరి నిమిషంలో ములాఖత్కు అనుమతివ్వడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల. ఇప్పటికిప్పుడు అనుమతి అంటే ఎలా ప్లాన్ చేసుకుంటారని ప్రశ్నించారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్ సమావేశం నిర్వహించారు. గద్దర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి నేతలు ఆయన్ను కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఇక, ఒంటి గంటా 50 నిమిషాలకు గాంధీభవన్లో ముఖ్యనేతలతో సమావేశమై, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్.. పార్టీ సభ్యత నమోదు కోఆర్డినేటర్లతో ఫొటో సెషన్ తర్వాత, సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!