Rahul Gandhi with truck drivers : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల అనంతరం కొద్ది రోజులు పార్టీ నేతలతో సమావేశాలను నిర్వహించారు. అనంతరం సోమవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. జూన్ 1 వరకు అమెరికాలోనే పర్యటించనున్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో ఏర్పడిన అంతఃకలహాలకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ నుంచి హైకమాండ్ పిలుపు మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమవేశమయ్యారు.
BJP vs Congress: మధ్యప్రదేశ్ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. అయితే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మళ్లీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
2024 సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు జూన్ 12న పాట్నాలో సమావేశం కానున్నాయి. 18కి పైగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఈ సదస్సుకు హాజరు కానున్నాయి.
Rahul Gandhi: ప్రధాన మంత్రి కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ‘‘ పట్టాభిషేక వేడుక’’లా పరిగణిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ప్రజల గొంతుక అని.. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
Rahul Gandhi: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకామని 19 ప్రతిపక్ష పార్టీలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య రాష్ట్రపతిని అవమానించడమే అని అన్నారు.
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజుల్లో చాలా మారిపోయినట్లున్నారు. ఒక్కోసారి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థులతో, మరికొన్ని సార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతతో సమావేశమవుతున్నారు.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రచ్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధాని కాదని అన్నారు.
Rajiv Gandhi : నేడు రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.