Rahul Gandhi: ప్రధాని మోడీని దేవుడితో కూర్చోబెడితే.. దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందో వివరిస్తాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 6 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యావేత్తలతో మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులు, అమెరికా చట్ట సభ సభ్యులతో భేటీ కానున్నారు. ఈరోజు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. తమకు అన్నీ తెలుసు అనుకునే సమూహం భారతదేశాన్ని నడుపుతోంది, ప్రధాని నరేంద్ర మోడీని దేవుడితో కూర్చోబెడితే.. విశ్వం ఎలా పనిచేస్తుందో దేవుడికే వివరిస్తారంటూ, దీనికి దేవుడే గందరగోళపడతాడంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Asaduddin Owaisi: దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. కేంద్రానికి ఓవైసీ సవాల్..
Also Read
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
భారత జోడో యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందని అన్నారు. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకే జోడో యాత్రను ప్రారంభించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విశ్వాసాలను, విభిన్న మతాల ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత విలువను నమ్ముతుందని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ఆప్యాయత, గౌరవం మరియు వినయం యొక్క స్ఫూర్తిని కలిగి ఉంది. చరిత్రను అధ్యయనం చేస్తే, గురునానక్ దేవ్ , గురు బసవన్న, నారాయణ గురు సహా ఆధ్యాత్మిక గురువులందరూ ఇదే విధంగా దేశాన్ని ఏకం చేశారని అన్నారు. ప్రాంతీయ భాషలపై దాడి చేయడాన్ని మేము అనుమతించమని, ఇలా చేస్తే ఇది భారత్ పై దాడి అవుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ కుల గణాంకాలను విడుదల చేయదని, దళితులు, గిరిజనులు, మైనారిటీల పట్ల ప్రేమగా వ్యవహరించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇదే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కోపం, ద్వేషం వంటి సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ అతని ప్రభుత్వం పరిష్కరించలేదని.. అందుకే రాజదండం అంటూ సాకులు చెబుతుందని ఆయన పార్లమెంట్ లో సెంగోల్ ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!