Rahul Gandhi: ప్రధాని మోడీని దేవుడితో కూర్చోబెడితే.. దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందో వివరిస్తాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 6 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యావేత్తలతో మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయులు, అమెరికా చట్ట సభ సభ్యులతో భేటీ కానున్నారు. ఈరోజు శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మాట్లాడుతూ.. తమకు అన్నీ తెలుసు అనుకునే సమూహం భారతదేశాన్ని నడుపుతోంది, ప్రధాని నరేంద్ర మోడీని దేవుడితో కూర్చోబెడితే.. విశ్వం ఎలా పనిచేస్తుందో దేవుడికే వివరిస్తారంటూ, దీనికి దేవుడే గందరగోళపడతాడంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Asaduddin Owaisi: దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి.. కేంద్రానికి ఓవైసీ సవాల్..
Also Read
భారత జోడో యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేసిందని అన్నారు. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకే జోడో యాత్రను ప్రారంభించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విశ్వాసాలను, విభిన్న మతాల ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత విలువను నమ్ముతుందని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ఆప్యాయత, గౌరవం మరియు వినయం యొక్క స్ఫూర్తిని కలిగి ఉంది. చరిత్రను అధ్యయనం చేస్తే, గురునానక్ దేవ్ , గురు బసవన్న, నారాయణ గురు సహా ఆధ్యాత్మిక గురువులందరూ ఇదే విధంగా దేశాన్ని ఏకం చేశారని అన్నారు. ప్రాంతీయ భాషలపై దాడి చేయడాన్ని మేము అనుమతించమని, ఇలా చేస్తే ఇది భారత్ పై దాడి అవుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ కుల గణాంకాలను విడుదల చేయదని, దళితులు, గిరిజనులు, మైనారిటీల పట్ల ప్రేమగా వ్యవహరించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇదే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కోపం, ద్వేషం వంటి సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ అతని ప్రభుత్వం పరిష్కరించలేదని.. అందుకే రాజదండం అంటూ సాకులు చెబుతుందని ఆయన పార్లమెంట్ లో సెంగోల్ ను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!