Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు. తన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయించి బీజేపీ ప్రభుత్వం తనకు ఒక రకంగా మంచి గిఫ్ట్ ఇచ్చిందన్నారు. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల తర్వాత బీజేపీని అధికారం నుంచి దించగలదన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న గాంధీ నిన్న వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు.
Read Also: Telangana : కామారెడ్డిలో అమానుషం.. బైక్ పై తీసుకెళ్లి మాహిళపై అత్యాచారం..
Also Read
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
- US - Iran War: ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగ్గా పనిచేస్తుందని తాను భావిస్తున్నాను అన్నారు. ఇది ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తుందని రాహుల్ తెలిపారు. ప్రతిపక్షం ఐక్యంగా ఉండి బీజేపీని ఓడిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండడంతో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని చెప్పారు. ప్రతిపక్షం ఐక్యంగా ఉంది. కాంగ్రెస్ అన్ని ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతుందన్నారు. అక్కడక్కడా ప్రతిపక్షాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి కొనసాగుతుందన్నారు. కొన్నిచోట్ల తాము తగ్గడం.. మరికొన్ని చోట్ల ఇతర పార్టీలు తగ్గడం తప్పదన్నారు. దేశంలో మహా ప్రతిపక్ష కూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించడం ఖాయమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను తమ అధీనంలో పెట్టుకొని, నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గతంలో వివిధ ప్రతిపక్ష నాయకులు చేసిన అభియోగాన్ని అధికార పార్టీ తిరస్కరించిందని గుర్తు చేశారు.
Read Also: Margani Bharat: టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానం
రాహుల్ గాంధీని విదేశాలలో మాట్లాడటానికి ఎందుకు ఆహ్వానిస్తారో ఆలోచించమని ప్రజలకు వదిలివేస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. పరువు నష్టం కేసులో బీజేపీ తనపట్ల వ్యవహారించిన తీరు తనకు గిఫ్ట్ లాంటిదని రాహుల్ గాంధీ అన్నారు. అది తనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. పుట్టిన వారు చనిపోక తప్పదని.. తాను ఎపుడు కూడా చావుకు, బెదిరింపులకు భయపడటం లేదన్నారు. తన నానమ్మ, తండ్రి మరణాలు తనకు గుర్తు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని రాహుల్ మరోసారి తెలిపారు. ఈ నెలాఖరులో భారత ప్రధాన మంత్రి అమెరికా పర్యటన ఉన్న సందర్భంగా అంతకంటే ముందే ఇపుడు రాహుల్ గాంధీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
-
FIFA World Cup 2026 Awards List: ఫిఫా వరల్డ్ కప్ అవార్డుల జాబితా.. అన్ని ప్రధాన వ్యక్తిగత అవార్డులు స్పెయిన్కే
-
Hi Movie OTT: నయనతార ‘హాయ్’ మూవీ డిజిటల్ డీల్ ఫిక్స్.. థియేటర్ల తర్వాత ఈ ఓటీటీలో స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!