BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే ఆ విమర్శలకు బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తే ఆయనలోని మహ్మద్ అలీ జిన్నా ఆత్మ ప్రవేశిస్తుందని విమర్శించారు. ‘‘రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు, జిన్నా ఆత్మ లేదా అల్-ఖైదా వంటి వ్యక్తుల ఆలోచన అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అతను భారతదేశానికి వచ్చిన తర్వాత మంచి భూతవైద్యుని నుండి భూతవైద్యం చేయించుకోవాలి’’ అని నఖ్వీ సూచించారు.
Read Also: Land Rates: ఏపీలో భూముల ధరలకు రెక్కలు..! రేపటి నుంచే అమలు
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
రాహుల్ గాంధీ సమస్య ఏంటంటే.. ప్రధాని నరేంద్రమోడీ అతని ప్యూడల్ వ్యవస్థను నాశనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నఖ్వీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని, రాజరికాన్ని సమానం అని భావిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ భారతదేశ పరువు తీసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్నారని, కాంగ్రెస్ ముస్లింలను చూయింగ్ గమ్ లాగా ఉపయోగించుకుందని నఖ్వీ అన్నారు.
అంతకుముందు కాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. తన భారత్ జోడోయాత్రను ప్రభుత్వం అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని అన్నారు. మోడీని దేవుడితో కూర్చోబెడితే .. దేవుడికే విశ్వం ఎలా పనిచేస్తుందనేది చెబుతాడంటూ ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!