Cops Move In To Arrest Separatist Leader Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధం అయ్యారు. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం శనివారం అతని మద్దుతుదారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోగా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. రేపు మధ్యహ్నం 12 గంటల వరకు పంజాబ్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. జీ20 ఈవెంట్ పంజాబ్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో అమృత్…
బాల్య వివాహాల ఆరోపణలపై అరెస్టయిన దాదాపు 1000 మందికి ఇంకా బెయిల్ రాలేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాలను రాష్ట్రం నుండి తొలగిస్తుందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.
పంజాబ్లో ఆప్ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ వివాహం ఐపీఎస్ అధికారిణి జ్యోతి యాదవ్తో ఈ నెలాఖరులో జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నట్లు వారు తెలిపారు.
పంజాబ్లో తుపాకీ సంస్కృతిపై అణిచివేత కొనసాగిస్తూ భగవంత్-మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం 813 ఆయుధాల లైసెన్స్లను రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్లను రద్దు చేసింది.
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది.
CM Bhagwant Mann: ఖలిస్తానీ వేర్పాటువాదులు, రాడికల్ సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ కార్యకర్తలు, దాని చీఫ్ అమృత్ పాల్ సింగ్ అజ్నాలాలోని పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో మళ్లీ ఖలిస్తాన్ పేరుతోె విభజన బీజాలు నాటాలని ప్రయత్నిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ అనుచరుడు జైలులో ఉన్న లవ్ ప్రీత్ సింగ్ తూఫాన్ ను విడిపించేందుకు పెద్ద ఎత్తున ఖలిస్తానీ వేర్పాటువాదులు కత్తులు, ఇతర ఆయుధాలతో…
పంజాబ్లోని తరన్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు.
Khalistan sympathiser Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని సవాల్ చేస్తూ హెచ్చరించారు. ఇటీవల అజ్నాలా పోలీస్ స్టేషన్ పై సాయుధులుగా వచ్చి దాడి చేశారు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులు. అతని అనుచరుడిని అరెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఖలిస్తానీ మద్దతుదారులు వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు.
NIA, IT raids across the country: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఐటీ డిపార్ట్మెంట్లు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నాయి. గ్యాంగ్ స్టర్- టెర్రర్ లింకులపై ఎన్ఐఏ విస్తృతంగా దాడులు చేస్తోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లోని 72 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఆయుధాల సరఫరాదారు ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్తాన్ నుంచి సరఫరా చేసిన వస్తువులను…