Punjab: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు సిద్ధం.. పంజాబ్ అంతటా ఇంటర్నెట్ సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cops Move In To Arrest Separatist Leader Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధం అయ్యారు. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం శనివారం అతని మద్దుతుదారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోగా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. రేపు మధ్యహ్నం 12 గంటల వరకు పంజాబ్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. జీ20 ఈవెంట్ పంజాబ్ లో ముగిసిన తర్వాతి రోజే అమృత్ పాల్ సింగ్ పై చర్యలు తీసుకోవడానికి పంజాబ్ గవర్నమెంట్ సిద్ధం అయింది.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్దూ ప్రారంభించిన సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’కు ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయనను అరెస్ట్ చేసేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది జలంధర్లోని షాకోట్లోని మెహత్పూర్ గ్రామంలో అతనిని చుట్టుముట్టారు. అమృతపాల్ సింగ్ పర్యటనకు సంబంధించిన ముందస్తు సమాచారం ఉన్నందున పోలీసులు షాకోట్లో అన్ని రహదారులను మూసివేసి భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
Read Also: Harrasment : నాకు ప్రమోషన్ కావాలి.. నువ్వు మా బాస్ పక్కలో పడుకోవాలి
గత నెలలో అమృత్ పాల్ సింగ్ మద్దతుదారుడు లవ్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అమృత్ పాల్ సింగ్ నేతృత్వంలోని ఖలిస్తానీ మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులు, ఎస్పీపై దాడి చేశారు. లవ్ ప్రీత్ సింగ్ ను విడుదల చేసేదాకా అక్కడే మరణాయుధాలు పట్టుకుని హడావుడి చేశారు. ఈ దాడి దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఖలిస్తానీ మూమెంట్ ను ప్రారంభించే పలువురిని అమృత్ పాల్ సింగ్ రెచ్చగొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ.. ఖలిస్తాన్ కోసం ఆయుధాలు చేపట్టడం గురించి మాట్లాడే వ్యక్తి నేడు పోలీసులకు భయపడి పారిపోతున్నాడని అన్నాడు.
అజ్నాలా ఘటనపై పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా..? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో గవర్నర్ పాలనను డిమాండ్ చేసింది, మరియు పంజాబ్ కాంగ్రెస్ పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు అమృతపాల్ సింగ్ మరియు అతని మద్దతుదారులను అరెస్టు చేయాలని కోరింది. ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు అదుపుతప్పాయని బీజేపీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!