Punjab: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు సిద్ధం.. పంజాబ్ అంతటా ఇంటర్నెట్ సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cops Move In To Arrest Separatist Leader Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధం అయ్యారు. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం శనివారం అతని మద్దుతుదారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోగా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. రేపు మధ్యహ్నం 12 గంటల వరకు పంజాబ్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. జీ20 ఈవెంట్ పంజాబ్ లో ముగిసిన తర్వాతి రోజే అమృత్ పాల్ సింగ్ పై చర్యలు తీసుకోవడానికి పంజాబ్ గవర్నమెంట్ సిద్ధం అయింది.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్దూ ప్రారంభించిన సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’కు ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయనను అరెస్ట్ చేసేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది జలంధర్లోని షాకోట్లోని మెహత్పూర్ గ్రామంలో అతనిని చుట్టుముట్టారు. అమృతపాల్ సింగ్ పర్యటనకు సంబంధించిన ముందస్తు సమాచారం ఉన్నందున పోలీసులు షాకోట్లో అన్ని రహదారులను మూసివేసి భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
Read Also: Harrasment : నాకు ప్రమోషన్ కావాలి.. నువ్వు మా బాస్ పక్కలో పడుకోవాలి
గత నెలలో అమృత్ పాల్ సింగ్ మద్దతుదారుడు లవ్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అమృత్ పాల్ సింగ్ నేతృత్వంలోని ఖలిస్తానీ మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులు, ఎస్పీపై దాడి చేశారు. లవ్ ప్రీత్ సింగ్ ను విడుదల చేసేదాకా అక్కడే మరణాయుధాలు పట్టుకుని హడావుడి చేశారు. ఈ దాడి దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఖలిస్తానీ మూమెంట్ ను ప్రారంభించే పలువురిని అమృత్ పాల్ సింగ్ రెచ్చగొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ.. ఖలిస్తాన్ కోసం ఆయుధాలు చేపట్టడం గురించి మాట్లాడే వ్యక్తి నేడు పోలీసులకు భయపడి పారిపోతున్నాడని అన్నాడు.
అజ్నాలా ఘటనపై పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా..? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో గవర్నర్ పాలనను డిమాండ్ చేసింది, మరియు పంజాబ్ కాంగ్రెస్ పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు అమృతపాల్ సింగ్ మరియు అతని మద్దతుదారులను అరెస్టు చేయాలని కోరింది. ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు అదుపుతప్పాయని బీజేపీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?