Punjab: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు సిద్ధం.. పంజాబ్ అంతటా ఇంటర్నెట్ సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cops Move In To Arrest Separatist Leader Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వివాదాస్పద అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు సిద్ధం అయ్యారు. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం శనివారం అతని మద్దుతుదారులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మోగా జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. రేపు మధ్యహ్నం 12 గంటల వరకు పంజాబ్ అంతటా ఇంటర్నెట్ నిలిపివేశారు. జీ20 ఈవెంట్ పంజాబ్ లో ముగిసిన తర్వాతి రోజే అమృత్ పాల్ సింగ్ పై చర్యలు తీసుకోవడానికి పంజాబ్ గవర్నమెంట్ సిద్ధం అయింది.
ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన దీప్ సిద్దూ ప్రారంభించిన సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’కు ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈయనను అరెస్ట్ చేసేందుకు ఏడు జిల్లాలకు చెందిన పోలీస్ సిబ్బంది జలంధర్లోని షాకోట్లోని మెహత్పూర్ గ్రామంలో అతనిని చుట్టుముట్టారు. అమృతపాల్ సింగ్ పర్యటనకు సంబంధించిన ముందస్తు సమాచారం ఉన్నందున పోలీసులు షాకోట్లో అన్ని రహదారులను మూసివేసి భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
Read Also: Harrasment : నాకు ప్రమోషన్ కావాలి.. నువ్వు మా బాస్ పక్కలో పడుకోవాలి
గత నెలలో అమృత్ పాల్ సింగ్ మద్దతుదారుడు లవ్ ప్రీత్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అమృత్ పాల్ సింగ్ నేతృత్వంలోని ఖలిస్తానీ మద్దతుదారులు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులు, ఎస్పీపై దాడి చేశారు. లవ్ ప్రీత్ సింగ్ ను విడుదల చేసేదాకా అక్కడే మరణాయుధాలు పట్టుకుని హడావుడి చేశారు. ఈ దాడి దేశం అంతటా చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఖలిస్తానీ మూమెంట్ ను ప్రారంభించే పలువురిని అమృత్ పాల్ సింగ్ రెచ్చగొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ.. ఖలిస్తాన్ కోసం ఆయుధాలు చేపట్టడం గురించి మాట్లాడే వ్యక్తి నేడు పోలీసులకు భయపడి పారిపోతున్నాడని అన్నాడు.
అజ్నాలా ఘటనపై పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారా..? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు బీజేపీ రాష్ట్రంలో గవర్నర్ పాలనను డిమాండ్ చేసింది, మరియు పంజాబ్ కాంగ్రెస్ పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు అమృతపాల్ సింగ్ మరియు అతని మద్దతుదారులను అరెస్టు చేయాలని కోరింది. ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో ఏర్పడిన తర్వాత అక్కడ శాంతిభద్రతలు అదుపుతప్పాయని బీజేపీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో కనిపించిన నంబర్లతో అదృష్టం.. కూరగాయల వ్యాపారిణికి రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!