Bhagwant Mann: డ్రగ్స్ మాఫియాను పాకిస్తాన్ రక్షిస్తోంది.. అమిత్ షాతో పంజాబ్ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో డ్రోన్లు, డ్రగ్స్ అక్రమరవాణాపై చర్చించారు. డ్రగ్స్ మాఫియాకు పాకిస్తాన్ రక్షణ ఇస్తోందని భగవంత్ మన్, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నివాసంలో దాదాపుగా 40 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. పంజాబ్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు భద్రతపై ఇరువురు నేతల చర్చించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రామీణాభివృద్ధి నిధులను విడుదల చేయాలని సీఎం భగవంత్ మన్, హోంమంత్రిని కోరారు.
Read Also: Hathras case: హత్రాస్ అత్యాచారం కేసులో కీలక తీర్పు.. ఒకరికి జీవిత ఖైదు..
Also Read
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
- India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
- India 1947 to 2026: 79 ఏళ్ల స్వతంత్ర భారతం.. 1947 నుంచి 2026 వరకు దేశాన్ని మార్చిన 80 కీలక ఘట్టాలు ఇవే
గతేడాది భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం 22 డోన్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. దాదాపుగా 316 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ సరిహద్దుల్లో ఇద్దరు పాక్ చొరబాటుదారులను బీఎస్ఎఫ్ కాల్చి చంపింది. దీంతో పాటు ఆయుధాలను, 23 మంది పాకిస్తాన్ వ్యక్తులను వివిధ ఘటనల్లో బీఎస్ఎఫ్ పట్టుకుంది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో విస్తరిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమృత్ సర్ లో అజ్నాలా పోలీస్ స్టేషన్ పై ఖలీస్తానీ వేర్పాటువాద సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ అతని మద్దతుదారులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఏకంగా కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలకే వార్నింగ్ ఇచ్చారు అమృత్ పాల్ సింగ్. ఈ దాడిలో ఒక ఎస్పీతో సహా ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!