ప్రధాని మోడీ మంగళవారం హిమాచల్ప్రదేశ్, పంజాబ్లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు.
ఈ ఏడాది ఉత్తర భారత్ అంతటా వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్లు జరగడం.. కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ఎక్కువగా హిమాచల్ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు భారీ నష్టాన్ని చూశాయి.
పంజాబ్లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు.
పంజాబ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తుంది. నయాగావ్, పరిసర ప్రాంతాల్లోని జయంతి మజ్రీలోని ఐదు గ్రామాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. మజ్రీ వైపు ప్రవహించే కాలానుగుణ నది ఆదివారం ఉప్పొంగి ప్రవహించింది. ఇద్దరు యువకులు వారి జీప్ తో సహీ నది దాటేందుకు ప్రయత్నించగా వారిని స్థానికులు అడ్డుకున్నారు. అయినా వారి మాట లెక్క చేయకుండా జీప్ ను ముందుకు పోనిచ్చారు. దీంతో వారు జీపుతో సహా కొట్టుకుని పోయారు. గ్రామస్తులు జేసీబీ సహాయంతో జీపును…
Siddipet Army Jawan Missing in Punjab: పంజాబ్లో సిద్దిపేట జిల్లాకి చెందిన ఆర్మీ జవాన్ మిస్ అయ్యాడు. అనిల్ (30) అనే జవాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పి అదృశ్యమయ్యాడు. అనిల్ ఆచూకీ గత ఆరు రోజులుగా లభించడం లేదు. అనిల్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులకు ఆర్మీ సిబ్బంది సమాచారం ఇచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని వెతికి పెట్టాలని అనిల్ కుటుంబ సభ్యులు ఆర్మీ…
Body Found In Drum: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా నగరంలో ఓ భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఓ నీలి రంగు డ్రమ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
Supreme Court : ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నంత మాత్రాన మీకు మేం కేసు నుంచి రక్షణ కల్పించలేం అని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వరకట్నం కోసం భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఓ ఎన్ఎస్జీ కమాండో వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ గార్డ్లోని బ్లాక్ క్యాట్ కమాండో యూనిట్లో పనిచేస్తున్నాడు. అతను వరకట్నం కోసం భార్యను చంపేశాడనే…
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యక్రమాలు అంత చురుగ్గా కనిపించడం లేదు. కార్యకర్తలు కూడా నిరాశలోకి వెళ్లిపోయారు.
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైంది. అలాగే జూన్ మాసం కూడా సగం రోజులైపోతుంది. కానీ ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.