Kejriwal: బైపోల్స్ విజయంతో ఆప్లో జోష్.. రాజ్యసభకు కేజ్రీవాల్!
- బైపోల్స్ విజయంతో ఆప్లో జోష్
- రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్!
- జాతీయ రాజకీయాల్లో మళ్లీ స్పీడ్ అందుకోనున్న ఆప్ అధినేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యక్రమాలు అంత చురుగ్గా కనిపించడం లేదు. కార్యకర్తలు కూడా నిరాశలోకి వెళ్లిపోయారు. ఇలాంటి తరుణంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో సరికొత్త జోష్ తీసుకొచ్చింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో బైపోల్స్ జరిగాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో గుజరాత్లో ఒకటి, పంజాబ్లో ఒక స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి దాడి
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
తాజా ఫలితాలతో ఆప్ శ్రేణుల్లో కొత్త జోష్ తీసుకొచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్కు కొత్త బలాన్ని తీసుకొచ్చినట్లైంది. ఢిల్లీ ఫలితాలతో కేజ్రీవాల్ చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా అంత చురుగ్గా పాల్గొన్న సంఘటనలు లేవు. అయితే తాజాగా వెలువడిన బైపోల్స్ ఫలితాలతో కొత్త ఊపు తీసుకొచ్చింది. దీంతో ఆయన పెద్దల సభకు వెళ్లడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లొచ్చని పొలిటికల్గా ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
పంజాబ్లోని లూథియానా వెస్ట్, గుజరాత్లోని విశావదర్లో ఆప్ భారీ విజయాలు సాధించింది. దీంతో గుజరాత్, పంజాబ్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ను గెలిపించినందుకు ప్రజలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళలోని నీలంబర్ను గెలుచుకోగా, గుజరాత్లోని కడిని బీజేపీ కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని కాలిగంజ్ను టీఎంసీ తిరిగి దక్కించుకుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ విజయం సాధించింది. తొలిసారి బీజేపీ నుంచి గెలిచిన రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఢిల్లీలో పరాజయం తర్వాత ఆప్లో జోష్ తగ్గింది. తిరిగి నాలుగు నెలల తర్వాత సరికొత్త జోష్ వచ్చింది. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు కేజ్రీవాల్ కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో మళ్లీ స్పీడ్ అందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
#WATCH | Ludhiana, Punjab: AAP's Sanjeev Arora nears victory in Ludhiana West (Punjab) by-election (as per official EC trends) and Gopal Italia wins Visavadar (Gujarat) by-election.
Punjab AAP president and state minister Aman Arora says, "The credit goes to Arvind Kejriwal's… pic.twitter.com/Zkn30YBffa
— ANI (@ANI) June 23, 2025
తాజావార్తలు
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
-
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!