ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
హర్షల్ పటేల్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టడంతో స్టాండ్స్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టును.. 139 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. పంజాబ్ బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఒక్కడే అత్యధికంగా (30) పరుగులు చేశాడు. ఆ తర్వాత బెయిర్ స్టో (7), రోసో డకౌట్ అయ్యాడు. శశాంక్ సింగ్ (27),…
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓ మోస్తరు స్కోరు చేసింది. పంజాబ్ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్ల దూబె మళ్లీ విఫలమయ్యాడు. ఏమీ పరుగులు చేయకుండా డకౌట్ అయ్యాడు. ధోనీ కూడా ఒక్క రన్ చేయకుండానే ఔటయ్యాడు.
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే గత మూడేళ్ల నుండి పంజాబ్పై విజయం కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన గత 5 మ్యాచ్ల్లో పంజాబ్ 4 మ్యాచులు విజయం సాధించగా, చెన్నై కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది. పంజాబ్ బ్యాటింగ్లో బెయిర్ స్టో (46), రిలీ రోస్సో (43) పరుగులతో రాణించారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ (13), శశాంక్ సింగ్ (25*), సామ్ కరన్ (26*)
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైటింగ్ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62) పరుగులతో రాణించడంతో సీఎస్కే.. ఓ మోస్తరు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 163 పరుగుల ఫైటింగ్ టార్గెట్ను ఉంచింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.