ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా భర్త వెంగళిల్ శ్రీనివాసన్ (67) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి అయన తుదిశ్వాస విడిచారు. కొజికోడ్ జిల్లాలోని తిక్కోడి పెరుమల్పురంలో ఉన్న నివాసంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే శ్రీనివాసన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. Also Read: Quinton de Kock Century: రీఎంట్రీలో రెచ్చిపోతున్న డికాక్.. కెరీర్లోనే…
Vinesh Phogat Fires on PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చీఫ్ పీటీ ఉషపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 సమయంలో పీటీ ఉష కేవలం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని విమర్శించారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, ఫొటో షో కోసమే ఆమె వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం…
ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయాన్ని చవిచూసింది. సెమీ-ఫైనల్లో గెలిచిన తర్వాత ఆమె ఫైనల్ మ్యాచ్లోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ ఆమె బరువు నిర్దేశించిన నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నందున ఆమె అనర్హత వేటుపడింది.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే! రెజర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు..
రాజ్యసభ ప్యానల్వైస్ చైర్మన్గా మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నియమించారు.. అయితే, 10 రోజుల క్రితం సాయిరెడ్డిని.. వైస్ చైర్మన్గా నియమించినా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆయన పేరు తొలగించారు. అయితే, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్గా విజయసాయిరెడ్డిని నియమించారు.. సాయిరెడ్డితో పాటు.. పీటీ ఉషను కూడా ప్యానల్వైస్ చైర్మన్గా నియమిస్తూ.. రాజ్యసభలో ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. దీంతో.. విజయసాయి రెడ్డి, పీటీ…
PT USHA: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో కొత్త శకానికి పునాది పడింది. పరుగు రాణిగా పేరొందిన పీటీ ఉష(58) ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో ఆమె ఎన్నిక లాంఛనంగా జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సమక్షంలో శనివారం ఎన్నిక జరిగింది. వాస్తవానికి 2021 డిసెంబర్లోనే భారత ఒలింపిక్ సంఘం ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే ఐఓఏను సస్పెండ్…
Indian Olympic Association : భారత క్రీడాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు పీటీ ఉష. పరుగుల రాణిగా పీటీ ఉష పేరొందారు. క్రీడారంగానికి ఆమె చేసిన సేవలు అమోఘం. అందుకు ఆమెను గౌరవిస్తూ భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలి పదవి కట్టబెట్టారు.
రాజ్యసభ ఎంపీగా ప్రముఖ మాజీ క్రీడాకారిణి పీటీ ఉష ప్రమాణస్వీకారం చేశారు. ఆమె హిందీలో భాషలో ప్రమాణం చేసింది. ఇటీవల ప్రఖ్యాత స్వరకర్త ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నాయకుడు వీరేంద్ర హెగ్గడేతో పాటు ఉష పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేయబడింది. ఉషను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు నామినేట్ చేసింది.