Vinesh Phogat: పీటీ ఉష ఫొటో కోసమే వచ్చారు.. అదో పెద్ద రాజకీయం: వినేశ్ ఫొగాట్
- ఉష ఫొటో కోసమే వచ్చారు
- మెడల్ను ఎప్పుడో వదిలేసేశారు
- వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు
Vinesh Phogat Fires on PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చీఫ్ పీటీ ఉషపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 సమయంలో పీటీ ఉష కేవలం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని విమర్శించారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, ఫొటో షో కోసమే ఆమె వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం కారణంగానే కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)లో తీర్పు అనుకూలంగా రాలేదని వినేశ్ పేర్కొన్నారు.
2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్.. త్రుటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. వెయిట్ను తగ్గించుకొనేందుకు వినేశ్ బాగా కష్టపడ్డారు. ట్రెడ్మిల్, సౌనా బాత్, జిమ్, ఇతర వ్యాయామాలు చేశారు. ఈ సమయంలో ఆమె ఒక్క చుక్క నీరు కూడా తీసుకోలేదు. దాంతో ఆమె డీహైడ్రేషన్కు గురై.. ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న వినేశ్ను కలవడానికి ఐవోఏ చీఫ్ పీటీ ఉష వెళ్లారు. ఆ సమయంలో ఫోగట్తో ఉష ఫోటో కూడా దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినేశ్ మాట్లాడుతూ.. ఉషపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
Also Read: IND vs BAN: పాపం సర్ఫరాజ్.. ఎప్పటివరకు ఆగాలో?! అసలే లేటు ఎంట్రీ
‘పీటీ ఉష మేడమ్ నా దగ్గరకు వచ్చి ఫొటో దిగారు. నా ఆరోగ్యం గురించి ఆమె ఏమీ అడగలేదు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా కేవలం షో కోసమే. అదో పెద్ద రాజకీయం. ఫైనల్ అనర్హతపై కాస్లో నా పేరు మీదే కేసును ఫైల్ చేశా. వాస్తవానికి దేశం పేరుతో చేయాలి. కానీ ప్రభుత్వం, ఐవోఏ నుంచి మద్దతే లేదు. వారు మెడల్ను ఎప్పుడో వదిలేసేశారు. హారీశ్ సాల్వే కేసు వాదించేందుకు ముందుకు వచ్చారు. దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మద్దతు దక్కాలి. కానీ వారంతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యారు. థర్డ్ పార్టీగానే కాస్లో మేం వాదనలు వినిపించాం. దురదృష్టవశాత్తు అనుకూల ఫలితం రాలేదు’ అని వినేశ్ ఫొగాట్ తెలిపారు. రెజ్లింగ్కు వీడ్కోలు పలికిన వినేశ్.. ఇటీవల కాంగ్రెస్లో చేరారు. హర్యానాలోని జులనా స్థానం నుంచి ఆమె పోటీకి సిద్దమయ్యారు.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!