Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయంపై మోడీ ట్వీట్..పీటీ ఉషకి ప్రధాని ఫోన్
- ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయం
- బరువు నిర్దేశించిన నిబంధనల కంటే ఎక్కువగా ఉందని తిరస్కరణ
- ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ కు పెద్ద దెబ్బ
- ఈ అంశంపై మోడీ ట్వీట్
- పీటీ ఉషకు ప్రధాని ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయాన్ని చవిచూసింది. సెమీ-ఫైనల్లో గెలిచిన తర్వాత ఆమె ఫైనల్ మ్యాచ్లోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ ఆమె బరువు నిర్దేశించిన నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నందున ఆమె అనర్హత వేటుపడింది. ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం వినేష్ ఫోగట్, భారత్ ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. ఇదిలా ఇండగా.. వినేష్ ఫోగట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇలా రాశారు. ‘వినీష్ నువ్వు ఛాంపియన్లకే.. ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. ఇవాళ షాక్ తగిలింది. ఇది ఎంతటి బాధను కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన నుంచి నువ్వు బయటపడి బలంగా తిరిగి వస్తావని నేను ఆశిస్తున్నాను. మీమంతా నీకు అండగా ఉన్నాం” అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
READ MORE: Virat Kohli Doop: బంగ్లాదేశ్ అల్లర్లు విరాట్ కోహ్లీ డూప్..
Also Read
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
ఈ విషయమై భారత ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు పీటీ ఉషతో కూడా ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంపై ఉష నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. వినేష్ బహిష్కరణ తర్వాత భారతదేశానికి ఇప్పుడు ఏ ఎంపికలు ఉన్నాయని కూడా అడిగారు. వినేష్ ఫోగట్ కేసులో ఏమి చేయాలో చూడాలని పిటి ఉషను పీఎం మోడీ కోరినట్లు సమాచారం. ఈ సందర్భంలో.. చివరి ఎంపిక వరకు ప్రతి ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇది మాత్రమే కాదు.. వినేష్ ఫోగట్కు సహాయం చేయడానికి ఒలింపిక్ కమిటీకి నిరసన తెలియజేయవలసి వస్తే.. చేయమని పీటీ ఉషతో మోడీ అన్నారు.
READ MORE:Lava Yuva Star Price: లావా నుంచి సూపర్ స్మార్ట్ఫోన్.. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ! ధర 7 వేలే
కాగా.. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు భారీ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్కు చేరి.. పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. ఈ వేటుతో భారత్ సహా వినేశ్ స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?