కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీకి ఢిల్లీలోని లుటియన్స్లో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లారు. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండు హాల్స్ పేర్లు మార్చారు. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్, అశోక్ హాల్ను ఇక నుంచి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా మార్చారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ వెల్లడించింది.
Govindananda Saraswati: స్వామి అవిముక్తేశ్వరానంద ఒక నకిలీ బాబా అంటూ స్వామీ శ్రీ గోవిందానంద సరస్వతి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ రోజుల్లో ముక్తేశ్వరానంద అనే నకిలీ బాబా పాపులర్ అవుతున్నాడు. ప్రధాని మోడీ పాదాలను తాకుతున్నాడు, అంబానీ లాంటి బడా వ్యాపారవేత్త ఇంటికి స్వాగతిస్తున్నాడు. టీవలో కొందరు ఆయనను ‘శంకరాచార్య’ అనే ట్యాగ్ ఇస్తున్నారు. ముక్తేశ్వరానంద్ నకిలీ బాబా, అతను తన పేరకు సాధు, సంత్ లేదా సన్యాసి జోడించుకునే అర్హత లేదని…
Priyanka Gandhi:ఉత్తర్ ప్రదేశ్లో ‘కన్వర్ యాత్ర’ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రకు పోలీసులు విధించిన రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యాత్రా మార్గంలోని పలు తినుబండారాల దుకాణాల యజమానులు వారి పేర్ల కనిపించేలా ప్రదర్శించాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. పోలీసులు ఆదేశాలను ప్రియాంకాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘కులం మరియు మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే…
ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోటెత్తున్నారు. నోటిఫికేషన్లు వెలువడగానే జాబ్స్ కోసం ఎగబడుతున్నారు. ఆ మధ్య గుజరాత్లో హోటల్ ఉద్యోగం కోసం యువత ఎగబడింది.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ.. బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగించారు. దీనికి మోడీ సహా బీజేపీ ఎంపీలు మధ్యమధ్యలో అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక మధ్యలో రాహుల్ మతపరమైన బొమ్మలు చూపించడంపై అమిత్ షా ఎదురుదాడి చేశారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదిలిపెట్టిన తర్వాత తొలిసారిగా ఆ ప్రాంత ప్రజలకు లేఖ రాశారు. జూన్ 18న కేరళలోని ఈ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు.
బీజేపీ పాలనలో లక్షలాది మంది యువత భవిష్యత్త్ నాశనం అయిందని ఆరోపించింది. ఈ లీకేజీ కుంభకోణంలో 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.