Priyanka Gandhi: గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ..
- గాజాపై ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన ప్రియాంక గాంధీ
- గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య- ప్రియాంక గాంధీ
- ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటు- ప్రియాంక గాంధీ.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అనాగరికంగా అభివర్ణించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను జాతి నిర్మూలన చర్య అని తెలిపారు. ఇజ్రాయెల్ అనాగరికతకు అనేక పాశ్చాత్య దేశాలు మద్దతు పలకడం సిగ్గుచేటని ప్రియాంక ఆరోపించారు. గాజాలో కొనసాగుతున్న సైనిక చర్యను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలని ఆమె కోరారు. గాజాలో ప్రతిరోజూ అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులు, వైద్యులు, జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారని ప్రియాంక తెలిపారు.
Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..
Also Read
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
ప్రియాంక గాంధీ.. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూపై మండిపడ్డారు. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం యుఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగించిన అనంతరం ఉభయ సభల ఎంపీలు లేచి నిలబడి ఆయనకు చప్పట్లు కొట్టారు. అదే సమయంలో.. కొందరు నాయకులు ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ఈ క్రమంలో.. అమెరికా నేతల తీరుపై ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం, నాగరికతపై నమ్మకం ఉన్నవారు ఇలా చేసి ఉండరని అమెరికా నేతలను ఉద్దేశించి దుయ్యబట్టారు.
Zakia Khanam: వైసీపీకి మరో బిగ్ షాక్..! లోకేష్ను కలిసిన మండలి డిప్యూటీ చైర్పర్సన్
ఇంతకుముందు కూడా.. ప్రియాంక గాంధీ ఇజ్రాయెల్-హమాస్పై స్పందించారు. ఇదిలా ఉంటే.. యుద్ధం కారణంగా ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయింది. ఇజ్రాయెల్, హమాస్ గురించి ప్రపంచం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకవైపు చాలా పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు అండగా నిలుస్తుండగా, మరోవైపు మధ్య ఆసియాలోని ఇరాన్ వంటి దేశాలు పాలస్తీనాకు మద్దతు పలుకుతున్నాయి. ఈ యుద్ధంలో గాజా ప్రజలు అతిపెద్ద మూల్యాన్ని చెల్లిస్తున్నారు. గాజాలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిరంతరం సైనిక చర్య తీసుకుంటోంది. ఈ సైనిక చర్యలో చాలా మంది అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మృతి చెందిన వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. ప్రతిరోజూ గాజా నుండి చిన్న పిల్లల మరణ చిత్రాలు వెలువడుతున్నాయి. ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ నిర్మూలన వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!