Rahul Gandhi: కేరళ విలయం.. జాతీయ విపత్తే
- వయనాడ్లో రాహుల్.. ప్రియాంక పర్యటన
- బాధిత కుటుంబాలకు పరామర్శ
- కేరళ విలయం.. జాతీయ విపత్తేనన్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. బాధితుల్ని పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. కేరళ విలయంలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. కేరళకు జరిగిన నష్టం దేశానికి తీరని విషాదంగా పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదని.. బాధితులందరికీ అవసరమైన సాయం అందించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి బాధితులకు రావాల్సిన సాయం అందేవరకు కాంగ్రెస్ పోరాడుతుంద్నారు. ఇలాంటి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. దీనిపై సమగ్ర కార్యచరణ ప్రణాళిక అవసరం అని రాహుల్ తెలిపారు.

Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
దేశంలోనే అత్యంత భయంకరమైన విషాద ఘటన వయనాడ్లో చోటు చేసుకొందన్నారు. ప్రజలు తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో వారిని ఏ విధంగా ఓదార్చాలో తెలియడం లేదని. తన తండ్రి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎలా బాధపడ్డానో.. ఈరోజు అలాగే అనిపిస్తోందని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.

మంగళవారం వయనాడ్లో జరిగిన భారీ విపత్తుకు దాదాపు 250 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఇంకొందరు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇంకోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తున్నారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

#WATCH | Kerala: Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi and Congress leader Priyanka Gandhi Vadra visited Wayanad Hospital and relief camp at St Joseph UP School here, to meet the survivors and injured of the landslide.
(Source: AICC) pic.twitter.com/CaFbQj019c
— ANI (@ANI) August 1, 2024
#WATCH | After meeting Wayanad landslides survivors, Congress leader Priyanka Gandhi Vadra says, "One thing is very clear that the people living in this area who have been affected, most of them are saying that they do not want to go back and live in the same area because it is… pic.twitter.com/Xd3L1DQHJj
— ANI (@ANI) August 1, 2024
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!