Priyanka Gandhi: ‘కన్వర్ యాత్ర’ రూల్స్ రాజ్యాంగంపై దాడి.. యూపీ సర్కార్పై ఫైర్..
- ఉత్తర ప్రదేశ్ ‘కన్వర్ యాత్ర’ రూల్స్పై వివాదం..
- ఇది రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంకా గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi:ఉత్తర్ ప్రదేశ్లో ‘కన్వర్ యాత్ర’ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రకు పోలీసులు విధించిన రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యాత్రా మార్గంలోని పలు తినుబండారాల దుకాణాల యజమానులు వారి పేర్ల కనిపించేలా ప్రదర్శించాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. పోలీసులు ఆదేశాలను ప్రియాంకాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘కులం మరియు మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలి మరియు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
‘‘మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి కులం, మతం, భాష లేదా మరే ఇతర ప్రాతిపదికన వివక్ష చూపదని హామీ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్లోని బండ్లు, దుకాణాల యజమానుల పేర్ల బోర్డులను ఉంచాలనే విభజన ఉత్తర్వులు మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం , మన భాగస్వామ్య వారసత్వంపై దాడి’’ అని ఆమె అన్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనిని దక్షిణాఫ్రికా ‘‘వర్ణవివక్ష’’, హిట్లర్ నాజీల దురాగతంగా అభివర్ణించారు.
మరోవైపు మతపరమైనయ ఊరేగింపు సమయంలో గందరగోళాన్ని నివారించేందుకు అన్ని ఫుడ్ జాయింట్ల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సమర్థించుకున్నారు. యాత్రికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ అభిషేక్ సింగ్ అన్నారు. శివ భక్తుల వార్షిక తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్ర జూలై 22న ప్రారంభమవుతుంది.
हमारा संविधान हर नागरिक को गारंटी देता है कि उसके साथ जाति, धर्म, भाषा या किसी अन्य आधार पर भेदभाव नहीं होगा।
उत्तर प्रदेश में ठेलों, खोमचों और दुकानों पर उनके मालिकों के नाम का बोर्ड लगाने का विभाजनकारी आदेश हमारे संविधान, हमारे लोकतंत्र और हमारी साझी विरासत पर हमला है।
समाज…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!