Priyanka Gandhi: ‘కన్వర్ యాత్ర’ రూల్స్ రాజ్యాంగంపై దాడి.. యూపీ సర్కార్పై ఫైర్..
- ఉత్తర ప్రదేశ్ ‘కన్వర్ యాత్ర’ రూల్స్పై వివాదం..
- ఇది రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంకా గాంధీ..
Priyanka Gandhi:ఉత్తర్ ప్రదేశ్లో ‘కన్వర్ యాత్ర’ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రకు పోలీసులు విధించిన రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యాత్రా మార్గంలోని పలు తినుబండారాల దుకాణాల యజమానులు వారి పేర్ల కనిపించేలా ప్రదర్శించాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. పోలీసులు ఆదేశాలను ప్రియాంకాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘కులం మరియు మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలి మరియు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
Also Read
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
‘‘మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి కులం, మతం, భాష లేదా మరే ఇతర ప్రాతిపదికన వివక్ష చూపదని హామీ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్లోని బండ్లు, దుకాణాల యజమానుల పేర్ల బోర్డులను ఉంచాలనే విభజన ఉత్తర్వులు మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం , మన భాగస్వామ్య వారసత్వంపై దాడి’’ అని ఆమె అన్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనిని దక్షిణాఫ్రికా ‘‘వర్ణవివక్ష’’, హిట్లర్ నాజీల దురాగతంగా అభివర్ణించారు.
మరోవైపు మతపరమైనయ ఊరేగింపు సమయంలో గందరగోళాన్ని నివారించేందుకు అన్ని ఫుడ్ జాయింట్ల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సమర్థించుకున్నారు. యాత్రికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ అభిషేక్ సింగ్ అన్నారు. శివ భక్తుల వార్షిక తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్ర జూలై 22న ప్రారంభమవుతుంది.
हमारा संविधान हर नागरिक को गारंटी देता है कि उसके साथ जाति, धर्म, भाषा या किसी अन्य आधार पर भेदभाव नहीं होगा।
उत्तर प्रदेश में ठेलों, खोमचों और दुकानों पर उनके मालिकों के नाम का बोर्ड लगाने का विभाजनकारी आदेश हमारे संविधान, हमारे लोकतंत्र और हमारी साझी विरासत पर हमला है।
समाज…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 19, 2024
తాజావార్తలు
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
-
NTRNEEL : డ్రాగన్ పార్ట్ – 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!