టాలీవుడ్ లో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్.. యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి సూపర్ హీరో హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ బిగ్ అనౌన్సమెంట్ ను ఏకంగా ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లతో లాంచ్ చేయించడం విశేషం.…
DVV Danayya Son’s Debut : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కళ్యాణ్ కథానాయకుడిగా తన సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. కళ్యాణ్ లాంచ్ ప్యాడ్ కోసం చాలా మంది దర్శకులను పరిశీలించారు దానయ్య. వారసుడి ఎంట్రీ బాధ్యతలను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జను హీరోగా పరిచయం చేసి, తేజతోనే హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్…
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమా భారీ అంచనాలనే రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే.. తేజ, శివాని వేర్వేరు ప్రదేశాల్లో…
“జోంబీ రెడ్డి”తో హిట్ అందుకున్న కాంబోలో మరో సరికొత్త జోనర్ లో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి మరోసారి “హను-మాన్” ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోన్నారు. తెలుగులో మొదటిసారిగా సూపర్ హీరో సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని నెలకొంది. అయితే అప్పుడే సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 18 న ఉదయం…
యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా తీసుకునే హీరోల జాబితాలో చేరిపోయాడు. తేజ సజ్జ తన తరువాత సూపర్ హీరో మూవీ కోసం ఏకంగా కోటి రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకుంటున్నట్టు సమాచారం. Read Also : షూటింగ్ రీస్టార్ట్…
కోలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ పాత్రలకు, లేడీ విలన్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలే ఆమెకి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్రకు టాలీవుడ్ అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాలోని పాత్రకు కూడా ఆమెకు మంచి పేరొచ్చింది. రీసెంట్ గా గోపీచంద్ మలినేని-నందమూరి బాలయ్య సినిమాలోనూ…
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో, సరికొత్త శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది.…
యంగ్ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. తెలుగులో జాంబీ జోనర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఇదే కాగా.. ప్రేక్షకుల నుంచి ‘జాంబీ రెడ్డి’కి విశేషమైన స్పందన లభించింది. అయితే త్వరలో మరో విభిన్నమైన జోనర్ లో రూపొందనున్న చిత్రంలో తేజ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ రిపీట్ కాబోతోందట. ప్రస్తుతం మెటీరియల్ దశలో ఉన్న ఈ చిత్రం స్క్రిప్ట్…