‘మా’ రాజకీయం మరింత వేడెక్కింది. మంచు విష్ణు ప్యానెల్పై ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు శ్రీకాంత్, జీవితరాజశేఖర్ తో వచ్చి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.. కొద్దిరోజులుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ‘మా’…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీదారుల మధ్య విమర్శల పోరు పెరిగింది. తాజాగా జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందరూ జీవిత, రాజశేఖర్ లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? అని జీవితా ఆగ్రహించింది. గత ఎన్నికలప్పుడు నరేష్ వెంట ఉండి, ఆయన ఏది చెప్తే అది చేసాం.. కానీ ఇపుడు తెలిసి…
‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన సాధారణ ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా? అన్పించక మానదు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక గడువు దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించింది పూనమ్ కౌర్. తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న…
ఈ నెల 10న జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి బరిలోకి దిగుతానని చెప్పిన బండ్ల గణేశ్… ఆ ప్యానెల్ నుండి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నిలబడటంతో కినుక వహించాడు. అంతేకాదు… ఆ ప్యానెల్ నుండి బయటకు వచ్చేసి, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. అన్నమాట ప్రకారం… సెప్టెంబర్ 27న ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు.…
టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న అంశం ‘మా’ ఎలక్షన్స్.. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా.. గత రెండు నెలల నుంచే ‘మా’ వేడి మొదలైయింది. పోటీలో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక నటుడు నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణుకు పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా…
‘మా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 29 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, అనంతరం అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడించి ‘మా’ అధ్యక్షుడు ఎవరో తేల్చేయనున్నారు. ఈరోజు ఉదయం…
మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలు జరగనుండడంతో హడావిడి మొదలైంది. ఇప్పటికే ‘మా’ అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా సివిఎల్ నరసింహ రావు వంటి అభ్యర్థులు ‘మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఈ వార్ జరగనుంది. ఇటీవలే ప్రకాష్ రాజ్, విష్ణు తమ ప్యానెల్ లను, అందులో సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు…
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…