టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న అంశం ‘మా’ ఎలక్షన్స్.. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా.. గత రెండు నెలల నుంచే ‘మా’ వేడి మొదలైయింది. పోటీలో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక నటుడు నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణుకు పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా…
‘మా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 29 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, అనంతరం అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడించి ‘మా’ అధ్యక్షుడు ఎవరో తేల్చేయనున్నారు. ఈరోజు ఉదయం…
మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలు జరగనుండడంతో హడావిడి మొదలైంది. ఇప్పటికే ‘మా’ అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా సివిఎల్ నరసింహ రావు వంటి అభ్యర్థులు ‘మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఈ వార్ జరగనుంది. ఇటీవలే ప్రకాష్ రాజ్, విష్ణు తమ ప్యానెల్ లను, అందులో సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు…
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…
మురారి, ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ.. చాలా కాలం నుంచి అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘రంగమార్తాండ’ పైన చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరాఠీ సూపర్ హిట్ మూవీ ‘నటసామ్రాట్’కు రీమేక్గా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఆయనకు జంటగా…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా ) ఎన్నికల అక్టోబరు 10న జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.. మా అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహా రావులు ఎన్నికల రేస్ లో ఉన్నారు. అయితే ప్రకాష్ ప్యానల్ ఎన్నికల క్యాంపెన్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే విందు సమావేశాలు అంటూ ప్రకాష్ రాజ్ మీటింగ్ పెట్టగా.. మరోసారి మెంబర్స్ తో ‘మా ఎన్నికల’ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్ లో ఏ…
సౌత్ సీనియర్ నటుడు ఓ పేద కుటుంబం జీవితం మెరుగుపడడానికి తన వంతు సాయం చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలోని ఒక కుటుంబానికి తాను జేసీబీని బహుమతిగా ఇచ్చానని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన వారికి జేసీబీని అందజేసిన పోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ” ప్రకాష్ రాజ్ఫౌండేషన్ చొరవతో శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలో ఒక కుటుంబానికి జేసీబీతో సాధికారత కల్పించాం… వారి జీవితంలోకి…
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తేజ్కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. ఉత్తేజ్కి చెందిన వస్త్ర వ్యాపారాన్ని కూడా పద్మావతి నిర్వహించేవారు. ఉత్తేజ్…