భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్.. కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని అభినందించారు.. ఆరోగ్య రంగంతో పాటు, డిజిటల్ రంగం కూడా దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోడీని ప్రశంసించారు.. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములు కావడం మా అదృష్టం అంటూ అమృతమహోత్సవ్…
భారత స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది.. అహింసా విధానంతోనే కాదు సాయుధ పోరాటం ద్వారా బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి.. దాని కోసం ప్రత్యేకంగా శ్రీకారం చుట్టి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్.. మహాత్మాగాంధీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని.. పోరుబాట కూడా అవసరం అని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన.. దాని కోసం ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆజాద్ హిందూ…
భారత ప్రజానీకం నవచేతనతో ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం ఎవరికీ తలవంచదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకెళ్తూనే ఉందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను ఇవాళ భారత్ గౌరవించుకుంటోందన్నని ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోదీ. అంతకుముందు సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.