CM KCR : మోడీ.. నిన్ను నీ అహంకారమే పడగొడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Made Comments on PM Modi
తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం మునుగోడు ప్రజా దీవెన పేరుతో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. మోడీ.. నిన్ను నీ అహంకారమే పడగొడుతుందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అంతేకాకుండా.. ఈడీలు కాదు బోడిలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో.. ఈడీ వస్తే నాకే చాయి తాపీ పోవలె.. మోడీ నువ్వు గోకినా.. గోకక పోయినా నేను గోకుతూనే ఉంటా అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. రేపు అమిత్ షా తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చిందని, మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి…మన చుట్టూ చర్చ పెట్టాలన్నారు. జాతీయ స్థాయిలో పోరాటం కోసం వివిధ పార్టీలతో మాట్లాడుతున్నామని, గోల్ మాల్ ఉప ఎన్నిక అయితుందని, ఎవరి మంచికోరి ఈ ఉప ఎన్నిక ? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
K.Chandrashekar Rao : దేశంలో మతపిచ్చి ఎవరికి మంచిది.. అంతా బాగుండాలి.. అందులో మనం ఉండాలి
మునుగోడులో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ప్రకటించిందని, మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత కొనసాగలన్నారు. భవిష్యత్తు లో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని, కృష్ణా లో ఎన్ని నీళ్లు తెలంగాణకు వస్తాయో మోడీ సర్కార్ చెప్పదన్నారు. ఎందుకు మా వాటా తేల్చారు.. అని ఆయన ప్రశ్నించారు. బిడ్డా అమిత్ షా.. సమాధానం చెప్పు.. కొట్లాట తెలంగాణ కొత్త కాదు.. మొదలు పెడితే ఎంత దాకా అయిన పోతాం. రాజ్ గోపాల్ రెడ్డి, కేంద్ర మంత్రో కృష్ణ జలాల గురించి అడగరంట కానీ…అమిత్ షా ను డోల బాజ్ తో తీసుకువస్తారట. కృష్ణా జలాల వాటాపై మునుగోడు సభలో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.. ఎనిమిది ఏళ్ళు అయ్యింది …బీజేపీ సర్కార్ వచ్చి…ఒక్క మంచి మేలు జరిగిందా ఎవరికయినా..? అని సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!