యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
Ashwini Choubey : కేంద్ర మంత్రి అశ్విని చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైన గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్న వారు కనిపిస్తే కాల్చేయాలన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు.
పవిత్ర గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. రేపటి(ఏప్రిల్ 22) నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఏప్రిల్ 22 నుండి మే 3 వరకు జరిగే గంగా పుష్కరాలు జాతరను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు.
PM Modi: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నంబర్ వన్ గా ఉందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ో ఒకటని ఆయన అన్నారు.
Vande Bharat : వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 8న ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న.. సికింద్రబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీయూలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ఇలా ప్రతీపార్టీ కూడా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అంతా సెమీఫైనల్…
After Atiq Ahmed Murder, Centre Prepares Advisory For Journalists: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీస్ కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్ అతని సోదరులు అఫ్రాప్ అహ్మద్ లను పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చిచంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అఫ్రాఫ్ లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు నిందితులు దగ్గర నుంచి కాల్చి చంపారు.
కాంగ్రెస్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే నేడు మోడీ ప్రధాని అయ్యారని, అమిత్ షాకు హోంమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు అన్నారు. శుక్రవారం రాత్రి తెలంగాణలోని మంచిర్యాలలో జరిగిన 'జై భారత్ సత్యాగ్రహ సభలో' ఖర్గే ప్రసంగించారు.