PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో పాల్గొనడంతో పాటు అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు. అయితే మోడీ పర్యటనపై దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా తెగ ఉలికిపడుతున్నాయి. ఇరుదేశాల మధ్య బలపడుతున్న బంధం తమకు ఎక్కడ నష్టాన్ని కలిగిస్తుందో అని తెగ భయపడుతున్నాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనకు ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు. ఇది అమెరికా-ఇండియా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబం అని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో పర్యటన, ప్రాధాన్యత గురించి వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.‘‘ ప్రెసిడెంట్ జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్. జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు నేను యూఎస్ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నాను. మన…
PM Modi US Visit: అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఢిల్లీ నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం జూన్ 21న తెల్లవారుజామున 1.30 గంటలకు వాషింగ్టన్ లోని ఆండ్రూస్ ఎయిర్ఫోర్స్ బేస్లో దిగాల్సి ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 24 నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఆహ్వానం మేరకు మోడీ రెండు రోజుల పర్యటన జూన్ 24న ప్రారంభం కానుంది.
గాంధీ శాంతి పురస్కారాన్ని తమకు ప్రకటించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్ల్లు గీతా ప్రెస్ సోమవారం తెలిపింది. అయితే ఏ విధమైన విరాళాలు స్వీకరించడం తమ సాంప్రదాయం కానందున అవార్డు కింద ప్రకటించిన రూ. 1 కోటి నగదును తాము స్వీకరించబోమని గీతా ప్రెస్ ప్రకటించింది.
Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోడీపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. ఆదివారం శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు ముంబైలోని పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్తున్నారు. మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ ప్రధాని మోడీకి వైట్ హౌజులో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.
Pakistan: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ లోలోపల భయపడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్, భారత ఎదుగుదల, ప్రధాని నరేంద్రమోడీకి దొరుకుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటనపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్ స్పందించారు.
Rahul Gandhi: నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని అన్నారు.