Kishan Reddy: ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారు?.. బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ప్రధాని మోడీ కార్యక్రమాన్ని అధికార బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని బహిష్కరిస్తున్నారా? రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు బహిష్కరిస్తున్నారా? ఆయన అడిగాడు. ఈ రాష్ట్రంలో ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి.. హామీలను తుంగలో తొక్కిన కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్ను బహిష్కరిస్తారు. రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్ను బహిష్కరిస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్హౌస్కు పరిమితం చేసే రోజు ఎంతోదూరంలో లేదని అన్నారు.
Read also: Etala Rajender: ఇప్పటికే ఆలస్యం జరిగింది.. బీఆర్ఎస్ను దించేది బీజేపీ నే
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొత్తు చరిత్ర ఉంది. బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ కలవదని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ, అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే.. వాటికి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు అన్యాయం చేసినట్లే అన్నారు. కాంగ్రెస్ , బీఆర్ ఎస్ కలిసి ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అమలు కావని అన్నారు. ప్రపంచ ప్రజాదరణ పొందిన నాయకుడు మోడీ అని తెలిపారు. 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని నాయకుడు మోడీ. 30 ఏళ్ల తర్వాత ఓరుగల్లుకు ప్రధాని మోడీ వచ్చారు. వర్షం కురుస్తున్నప్పటికీ గ్రామాల నుంచి సభకు జనం తరలివచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.
Modi Warangal Tour: తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!