Karnataka High Court: ప్రధానిపై దుర్భాషలాడడం అవమానకరం, కానీ దేశద్రోహం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: ప్రధానమంత్రిపై దుర్భాషలాడడం అవమానకరమైనదని,బాధ్యతారాహిత్యమైనదని.. అయితే అది దేశద్రోహం కాదని, పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహ కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది. బీదర్లోని షాహీన్ స్కూల్ యజమానులు అల్లావుద్దీన్, అబ్దుల్ ఖలీక్, మహ్మద్ బిలాల్ ఇనామ్దార్, మహ్మద్ మెహతాబ్లపై బీదర్ న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కల్బుర్గి బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందంగౌడ్ రద్దు చేశారు.
ఐపీసీ సెక్షన్ 153(ఎ)లోని అంశాలు ఈ కేసులో కనిపించలేదని కోర్టు పేర్కొంది. ‘‘ప్రధానిని పాదరక్షలతో కొట్టాలని దుర్భాషలాడడం అవమానకరమైనది మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యమైనది. ప్రభుత్వ విధానంపై నిర్మాణాత్మక విమర్శలు అనుమతించదగినవే, కానీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నందుకు రాజ్యాంగాధికారులను అవమానించలేం. కొన్ని వర్గాలకు అభ్యంతరం ఉండవచ్చు’’ అని జస్టిస్ చందంగౌడ్ తన తీర్పులో పేర్కొన్నారు.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Also Read: PM Modi: “మోడీ భయపడేవాడు కాదు”.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని..
పిల్లలు ప్రదర్శించిన నాటకం ప్రభుత్వం వివిధ చట్టాలను విమర్శించిందని.. “అలాంటి చట్టాలను అమలు చేస్తే, ముస్లింలు దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుంది” అని ఆరోపించబడినప్పటికీ, పాఠశాల ఆవరణలో నాటకం ప్రదర్శించబడిందని కోర్టు పేర్కొంది. హింసను ఆశ్రయించమని లేదా ప్రజా అశాంతిని సృష్టించడానికి ప్రజలను ప్రేరేపించే మాటలు పిల్లలచే చెప్పబడలేదని న్యాయస్థానం తెలిపింది. నిందితుల్లో ఒకరు తన సోషల్ మీడియా ఖాతాలో నాటకాన్ని అప్లోడ్ చేయడంతో నాటకం ప్రజలకు తెలిసిందని హైకోర్టు పేర్కొంది. ప్రజలను ప్రేరేపించే ఉద్దేశ్యంతో లేదా ప్రజా అశాంతిని సృష్టించే ఉద్దేశ్యంతో ఈ నాటకాన్ని ప్రదర్శించారని చెప్పలేమని పేర్కొంది. ఈ విషయంలో సెక్షన్ 124A, సెక్షన్ 505 (2) కింద నేరం కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనుమతించబడదని కోర్టు పేర్కొంది.
జనవరి 21, 2020న 4, 5, 6 తరగతుల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (NRC)కి వ్యతిరేకంగా నాటకాన్ని ప్రదర్శించిన తర్వాత పాఠశాల అధికారులపై దేశద్రోహ కేసు నమోదు చేయబడింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త నీలేష్ రక్షాల ఫిర్యాదు మేరకు నలుగురిపై సెక్షన్ 504, 505(2), 124A (విద్రోహం), 153A సెక్షన్ 34తో పాటు IPC కింద అభియోగాలు మోపారు. ప్రభుత్వాలను విమర్శించకుండా పిల్లలను దూరంగా ఉంచాలని హైకోర్టు తన తీర్పులో పాఠశాలలకు సలహా కూడా ఇచ్చింది.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..