PM Modi: “మోడీ భయపడేవాడు కాదు”.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఛత్తీస్గఢ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ‘మోడీ భయపడేవాడు కాదు’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా నేను వెనకడుగు వేయను అని.. ఛత్తీస్గఢ్ సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిన దాని కన్నా రెట్టింపు చేశామని, పేదలకు కాంగ్రెస్ పార్టీ శతృవని అన్నారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధిలో కాంగ్రెస్ అడ్డుగోడల నిలుస్తోందని.. ఇది మీ హక్కుల్ని లాగేసుకుంటుందని విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రధాని ఆరోపించారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఛత్తీస్గఢ్ మార్పు గాలి వీస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ ని నాశనం చేసిందని ఆయన అన్నారు. కాంకేర్ జిల్లాలోని అంతఘర్ మరియు రాయ్పూర్ మధ్య కొత్త రైలును ప్రధాని మోదీ వాస్తవంగా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలకు విస్తారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయని అన్నారు. గిరిజన ప్రజలకు సౌకర్యాలు, అభివృద్ధి కనిపిస్తాయని అన్నారు.
అంతకుముందు ప్రధాని సభకు వస్తూ ముగ్గురు బస్ ప్రమాదంలో మరణించారు. వారి గురించి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి చికిత్స కోసం అన్ని విధాల సహాయం అందచేస్తానని తెలిపారు. 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఛత్తీస్ గఢ్ కు ప్రధాని రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి చత్తీస్ గఢ్ లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసింది. వరసగా మూడు సార్లు 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
- Tags
- bjp
- Chhattisgarh
- congress
- PM Modi
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!