PM Modi: “మోడీ భయపడేవాడు కాదు”.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఛత్తీస్గఢ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ‘మోడీ భయపడేవాడు కాదు’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా నేను వెనకడుగు వేయను అని.. ఛత్తీస్గఢ్ సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిన దాని కన్నా రెట్టింపు చేశామని, పేదలకు కాంగ్రెస్ పార్టీ శతృవని అన్నారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధిలో కాంగ్రెస్ అడ్డుగోడల నిలుస్తోందని.. ఇది మీ హక్కుల్ని లాగేసుకుంటుందని విజయ్ సంకల్ప్ మహార్యాలీలో ప్రధాని ఆరోపించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఛత్తీస్గఢ్ మార్పు గాలి వీస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ ని నాశనం చేసిందని ఆయన అన్నారు. కాంకేర్ జిల్లాలోని అంతఘర్ మరియు రాయ్పూర్ మధ్య కొత్త రైలును ప్రధాని మోదీ వాస్తవంగా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలకు విస్తారమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయని అన్నారు. గిరిజన ప్రజలకు సౌకర్యాలు, అభివృద్ధి కనిపిస్తాయని అన్నారు.
అంతకుముందు ప్రధాని సభకు వస్తూ ముగ్గురు బస్ ప్రమాదంలో మరణించారు. వారి గురించి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. గాయపడిన వారికి చికిత్స కోసం అన్ని విధాల సహాయం అందచేస్తానని తెలిపారు. 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఛత్తీస్ గఢ్ కు ప్రధాని రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సారి చత్తీస్ గఢ్ లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేసింది. వరసగా మూడు సార్లు 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
- Tags
- bjp
- Chhattisgarh
- congress
- PM Modi
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!