'Bharat' controversy: ‘ఇండియా’ పేరు ‘భారత్’గా మారుస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 18-22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పెడతారని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ ఫర్హాన్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల పేర్లు మార్చుకోవాలని ఆ దేశాలు అనుకున్నప్పుడు యూఎన్ వాటిని పరిగణలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.
PM Modi: తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూమతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది.
New Parliament: కేంద్రం ఈ నెల 18-22 వరకు 5 రోజలు పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది.
Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని కోరారు.
Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, జమిలి ఎన్నికలు, ఇండియా పేరు భారత్ గా మార్పు, మహిళా రిజర్వేషన్ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు.
G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలోయింగ్ మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో యోగి సంచలనం సృష్టించారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిదిలో బొంగుళూర్ లోని ఓ గార్డెన్ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర రైతు సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, big news, kishan reddy, bjp, brs, congress, PM Modi,
France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ ని ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ సందర్శించారు. ఈ సమయంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇది జరిగిన నెల తర్వాత మక్రాన్ ఈ ప్రకటన చేశారు.
MK Stalin: ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పోడ్కాస్ట సిరీస్ తొలి ఎపిసోడ్ లో బీజేపీపై విమర్శలు గుప్పించారు.