Asaduddin Owaisi: “మాకు టికెట్ ఇస్తే హిందువుల ఓట్లు రావని”.. ఇండియా కూటమిపై ఓవైసీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. సోమవారం ఓ కార్యక్రంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమిలోకి తమను ఆహ్వానించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూటమిలో భాగం కానని, దానితో ఉంటే నరకం అని, కూటమిలో చేరితో ఉక్కిరిబిక్కిరి అయ్యేదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కూటమిలో చేరడానికి తమకు ఆహ్వానించపోవడాన్ని తాను పట్టించుకోనని అన్నారు.
‘‘నేను ఇండియా కూటమిలో లేనిని.. దాన్ని పట్టించుకోనని, ఇండియా కూటమి సిద్దాంతాలు బీజేపీకి ఎందుకు వ్యతిరేకంగా నిలవడం లేదు. మాకు టికెట్ ఇస్తే వారికి హిందూ ఓట్లు రావని అనుకుంటున్నారు, వారు మూసిన గోడల వెనక ఇలాగే మాట్లాడుతున్నారు, ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Punjab: పంజాబ్లో కాంగ్రెస్ నేత హత్య.. తామే చంపామన్న ఖలిస్తానీ ఉగ్రవాది..
2018 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓడిపోవడాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోతే, వయనాడ్ నుంచి ఓడిపోకుండా అప్పుడు రక్షించింది ముస్లిం లీగ్ అని ఓవైసీ అన్నారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు, వయనాడు నుంచి గెలిచారు, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయలేదు, అక్కడ బీజేపీతో నాకు ఎలాంటి ఒప్పందం లేదు, అయితే అక్కడ ముస్లిం లీగ్ ఉంది, కాబట్టే ఆయన వయనాడ్ నుంచి గెలిచాడు, రాహుల్ గాంధీ మునిగిపోకుండా కాపాడిందని ఓవైసీ అన్నారు.
ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వ సంస్థలు దాడులు చేస్తుంటే, ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసులు లేవని, వారికి బీజేపీ, ప్రధాని మోడీతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ఆరోపించిన తర్వాత ఓవైసీ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఒక్క టీఆర్ఎస్ తోనే కాదు బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతోందని అన్నారు. బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే కేసీఆర్, ఎంఐఎం నేతలపై ఎలాంటి కేసు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!