PM Modi: అరేబియా సముద్రం నీటి అడుగున పూజలు నిర్వహించిన పీఎం మోడీ.. ఫోటోలు వైరల్..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందిన ద్వారక ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిందని భావిస్తుంటారు. పీఎం మోడీ అరేబియా సముద్ర నీటి అడుగున ద్వారకాధీశుడికి పూజలు నిర్వహించారు. శతాబ్ధాల క్రితం శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా సముద్ర అడుగు భాగంలో ఉందని హిందువులలు నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న పురాతన ద్వారక నగరం అవశేషాలను చూడవచ్చు. హిందూ గ్రంథాల్లో ఈ పురాతన ద్వారక నగరం గురించి ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు ద్వారక నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ నగరం సముద్రంలో కలిసిపోయినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.
Read Also: Garlic : భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. పంటకు సీసీటీవీ, తుపాకీలతో కాపలా
Also Read
ప్రస్తుతం ప్రధాని నిర్వహించిన పూజలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. ‘‘నీటిలో మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం మరియు కాలాతీత భక్తితో ముడిపడి ఉన్నానని భావించాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మా అందరినీ ఆశీర్వదించాలి’’ అని ప్రధాని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘నేను సముద్రం లోతుకి వెళ్లినప్పుడు, దైవత్వాన్ని అనుభవించానని, ద్వారకాధీశుడి ముందు నమస్కరించి, నెమలి ఈకలను శ్రీకృష్ణుడి పాదాల ముందు ఉంచానని, పురాతన ద్వారకా నగర అవశేషాలను చూడటంతో నా దశాబ్ధాల కల నెరవేరింది’’ అని ఆయన అన్నారు.
ఆదివారం ఉదయం గుజరాత్ లోని దేవభూమి ద్వారక జిల్లాలో బెట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలిపేందుకు అరేబియా సముద్రంపై 2.32 కి.మీ.ల పొడవైన, దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ని ప్రధాని ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి రూ. 979 కోట్ల వ్యయం అయ్యింది.
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో