నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది.
ఒడిశాలో బుధవారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కతమైంది. ఒకే స్టేజీపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్-ప్రధాని మోడీ ఎదురుపడ్డారు. కొంత సేపు స్టేజీపైనే సంభాషించుకున్నారు. దీంతో చుట్టూ ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.
Naseeruddin Shah: సీనియర్ సినీనటుడు నసీరుద్ధీన్ షా ప్రధాని నరేంద్రమోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. మోడీ మంత్రివర్గంలో ముస్లిం ప్రతినిధి లేకపోవడం బాధాకరమని అన్నారు. భారతీయ ముస్లింలను తాను ద్వేషించనని చెప్పడానికి మోడీ తన తలపై ముస్లింటోపీ ధరించడాన్ని చూడాలనుకుంటున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.
కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయుల మృతుల సంఖ్య 49కి చేరింది. బుధవారం తెల్లవారుజామున 10 అంతస్తుల బిల్డింగ్లో జరిగిన అగ్నిప్రమాదంలో సంఘటనాస్థలిలో 40 మంది భారతీయులు సజీవదహనం కాగా.. మరో 9 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
ప్రధాని మోడీ ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మోడీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి మోడీ ఎన్నికయ్యారు.
కువైట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది భారతీయులు సజీవ దహనం అయ్యారు. పలువురు భారతీయులు గాయపడ్డారు. ఆరు అంతస్తుల భవనంలోని వంటగదిలో మంటలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. భవనంలో దాదాపు 160 మంది నివసిస్తున్నట్లు వెల్లడించారు.
Ram Charan Emotional On Seeing Chiranjeevi & Pawan Kalyan: ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే మోడీని కలిశారు. మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగితే పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి మోడీని తీసుకువెళ్లారు. దీంతో మోడీని మెగాస్టార్ చిరంజీవి చేతిని మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకొని పైకెత్తి ప్రజలందరికీ అభివాదం చేశారు.…
PM Modi Talks With Pawan Kalyan and Chiranjeevi: ఏపీ మంత్రిగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జనసేనితో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదిక మొత్తం దద్దరిల్లిపోయింది. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదిక మీద ఉన్న…