PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
- కాంగ్రెస్పై ప్రధాని మోడీ ద్వజం..
- 2014కి ముందు నిరాశలో దేశ ప్రజలు..
- ఎక్కడ చూసినా కుంభకోణాలు-ఉగ్రదాడులే..
- మేం సర్జికల్ స్ట్రైక్- ఎయిర్ స్ట్రైక్ చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన నరేంద్రమోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ఈ రోజు పార్లమెంట్లో ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. తమకు దేశం మొదటి ప్రాధాన్యత అని అన్నారు. విపక్ష నేతలు మణిపూర్పై చర్చించాలని పట్టుబడుతున్నా, లోక్సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రధాని తన విమర్శల దాడిని కొనసాగించారు. అవినీతిని అసలు సహించేది లేదని చెప్పారు. ప్రజలు తమను మరోసారి ఎన్నుకున్నారని, కొంతమంది బాధను తాను అర్థం చేసుకోగలనని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: West Bengal: జంటపై దాడి ఘటనలో ట్విస్.. బాధితురాలి ఏం చేసిందంటే..!
Also Read
తమకు దేశం ముఖ్యమని, ఏ విషయంలోనైనా దీన్నే ప్రాధాన్యతగా తీసుకుంటామని చెప్పారు. ఎన్ని కుట్రలు ఆరోపణలు చేసినా, విపక్షాలు ఓడిపోయాయన్నారు. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాలను నమ్మి తమను మూడోసారి దేశ ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. దేశ ప్రజలు సెక్యులరిజం కోసం ఓటేసి మమ్మల్ని గెలిపంచారని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరించారని చెప్పారు.
2014 నాటికి ముందు దేశ ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని, దేశం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని, అలాంటి సమయం 2014కి ముందే ఉందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ వార్తపత్రిక చూసిన కుంభకోణాలే కనిపించేవని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయని అన్నారు. 2014కి ముందు టెర్రరిస్టులు ఎక్కడికైనా వచ్చి దాడులు చేసేవారని, అమాయకుల్ని చంపారని అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి హతమారుస్తున్నామని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!