వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చింది.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుంది.. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల పట్ల ఇలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదు అంటూ సీఎం వైఎస్ జగన్పై ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్న ఆయన.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను…
వారాహి యాత్రపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సినిమా మొదలు పెట్టేటప్పుడు క్లాప్ కొట్టి చెప్పే డైలాగుల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. నాకు అధికారం అవసరం లేదు... ముఖ్యమంత్రి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇంకేంటి ప్రజల్లోకి వెళ్ళేదంటూ ప్రశ్నించారు. ఇది చంద్రయాత్ర అని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబును పొగడటమే పవన్ కళ్యాణ్ పని అంటూ కామెంట్స్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై స్పందించిన పేర్ని నాని.. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1న మాత్రమేనని చంద్రబాబుకు పేర్ని గుర్తుచేశారు.